కొడంగల్, జూలై 11 : గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణలో సం క్షోభం నెలకొనగా.. నేడు బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన వందమంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు ఎమ్మెల్యే కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో తిరిగి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగడిరైచూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందే రేవంత్రెడ్డి బుద్ధ్ది బయటపడిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో రైతన్నలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండగా… వ్యవసాయానికి మూడు గంటల పాటు విద్యుత్తు సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కరెంట్ ఎప్పుడు వస్తుదో.. ఎప్పుడో పోతుందో తెలియక పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చిందని..కొందరు విద్యుదాఘాతంతో మృతువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకొస్తే రైతుల బతుకులు ఆగం కావడం ఖాయమన్నారు. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. రైతులను ఏవిధంగా నష్టపరచాలో కాంగ్రెస్ పారీ ్టకుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని కొనియాడారు. ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.
ఎమ్మెల్యేకు అండగా ఉంటాం..
కొడంగల్ నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు అండగా ఉంటామని పార్టీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి కొడంగల్ నుంచి రెండుసార్లు గెలిచి కూ డా సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేయలేదని.. కానీ.. ఎమ్మెల్యే నరేందర్ నాలుగేండ్ల కాలంలోనే నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయి..
రేవంత్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కొడంగల్ నుంచి పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. అధికారం కోసమే కొడంగల్ ప్రజలను రేవంత్రెడ్డి వాడుకుని వదిలేశారని ఆరోపించారు. రెండుసార్లు గెలిచి కూడా ప్రజల సమస్యలు, నియోజవర్గాభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. కొడంగల్ ప్రజల ఆదరాభిమానంతోనే రేవంత్రెడ్డికి టీపీసీసీ పదవి దక్కిందని, అటువంటి ప్రజలను విస్మరించి సీఎం సీటు కోసం పాకులాడుతున్నాడన్నారు. సీఎంగా అధికారంలోకి రాక ముందే ప్రజల సంక్షేమాన్ని కాలరాస్తున్నాడన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు మాత్రమే సరిపోతుందని పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కోరుతున్న పార్టీ కావాలో, ప్రజల వినాశనాన్ని కోరుతున్న పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను అంగడిరైచూర్ గ్రామ రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ గోవింద్, వైస్ ఎంపీపీ రహమత్ఖాన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, బిచ్చిరెడ్డి, బాలవర్ధన్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులే..;బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి
వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అవసరం లేదని, మూడు గంటలే రైతులు కోరుతున్నారని రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుని ఆనందం గా జీవిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని..సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నదన్నారు. అధికారంలోకి రాకముందే రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ చీకటి రోజులు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ను నమ్మితే కరెంటు లేకుండా పోతుందని, రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా పోతాయని ప్రజలకు సూచించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.