ఇబ్రహీంపట్నం, జనవరి 19 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో అనేకమందికి కంటి అద్దాలతో పాటు మందులను కూడా అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 16టీంల ఆధ్వర్యంలో కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 7 కంటివెలుగు పరీక్ష కేంద్రాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 3, మంచాల మండలంలో 2, యాచారంలో 2 కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటివెలుగు శిబిరాలకు ప్రజలు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్లో, పాతబస్టాండులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే దండుమైలారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సర్పంచ్ మల్లీశ్వరి ప్రారంభించారు. తులేకలాన్ గ్రామంలో సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపీటీసీ నాగటి నాగమణి ప్రారంభించారు. మంచాల మండలంలోని ఆరుట్ల, మంచాల గ్రామాల్లో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, జగన్రెడ్డి, ఎంపీటీసీలు రమేశ్, నరేందర్రెడ్డి, శ్రీనివాస్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాచారం మండల కేంద్రంతో పాటు తులేఖుర్దు గ్రామంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, తహసీల్దార్ సుచరిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఉమార్ఖాన్గూడలో కంటివెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, కౌన్సిలర్ శ్రీలత అనిల్కుమార్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ ఒకటో వార్డు రాజీవ్గృహకల్ప, కుంట్లూరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్గౌడ్తో కలిసి చైర్పర్సన్ స్వప్న ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ బుర్ర రేఖ, సర్పంచ్ చెరుకు కిరణ్గౌడ్ ప్రారంభించారు.
షాద్నగర్ : రెండో విడుత కంటి వెలుగు వైద్య శిబిరాలు షాద్నగర్ నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ నియోజకవర్గంలోని కొందుర్గు, చించోడు, ఎలికట్ట, నందిగామ గ్రామాల్లో కంటి వెలుగును ప్రారంభించారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్యాదవ్, కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్, బూర్గుల, చిన్న చిల్కమర్రి గ్రామాల్లో జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ శిబిరాలను ప్రారంభించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రారంభించారు. పేదల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 100 రోజుల పాటు నిర్వహించే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె శ్రీకాంత్, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, గోవర్ధ్దన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంపీడీవోలు అనురాధ, వెంకయ్య, సంధ్య, రాజ్కుమార్, డీఎల్పీవో శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు గూడూర్ నర్సింగ్రావు, ప్రభాకర్, మహేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కొలన్ ప్రభాకర్రెడ్డి, చాగంటి సుహాసిని, లలిత, విజయలక్ష్మి, సులోచన, స్వరూప, కరీమహబూబ్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామ పంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమనగల్లు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ ప్రారంభించారు. తలకొండలపల్లి మండల కేంద్రంతోపాటు చంద్రధన గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మాడ్గుల మండల కేంద్రం, ఇర్విన్ గ్రామంలో వైద్యాధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీలు నిర్మల, పద్మారెడ్డి, సర్పంచ్లు మంజుల, లలిత, జంగయ్యగౌడ్, పుష్పలత, యాదిరెడ్డి, రవీందర్రెడ్డి, ఎంపీటీసీలు జైపాల్రెడ్డి, తిరుపతమ్మ, హేమ, రైతుబంధు సమితి అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, వీరయ్య, పత్యానాయక్, నారాయణ, రమేశ్నాయక్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఐసీడీఎస్, ఏఎన్ఏం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, నాయకులు, తండావాసులు పాల్గొన్నారు.