తాండూరు, అక్టోబర్ 9 : తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ నులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గంలో రూ.54 కోట్ల 72 లక్షల 44 వేల అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.4.85 కోట్లతో బొంకూరు-బిజ్వార్ వాగులో బ్రిడ్జి, రూ.7 కోట్ల 67 లక్షల 70 వేలతో ఖాంజాపూర్లో చెక్డ్యాం, రూ.8.74 కోట్లతో చంద్రవంచ వాగులో చెక్డ్యాం, రూ.10.18 కో ట్లతో బెన్నూర్ వాగులో చెక్డ్యాం, రూ.87.50 లక్షలతో గొటిక కలాన్-పాటిమీదిపల్లి రోడ్డు, రూ.2.68 కోట్లతో నాగారం-చెన్నారం రోడ్డు, రూ.2 కోట్లతో తాండూరు మున్సిపల్లో గ్రీనరీ, రూ.6 కోట్లతో ఆదర్శ తులసీనగర్లో కేసీఆర్ థీమ్ పార్కు, రూ.కోటితో 26వ వార్డులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే రూ.8.90 కోట్లతో నిర్మించిన బుద్దారం, గాజీపూర్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డుపై వంతెన, రూ.86 లక్షలతో నిర్మించి ముద్దాయిపేట్ బ్రిడ్జి, రూ.25 లక్షలతో 8వ వార్డులో నిర్మించిన డ్వా క్రా, అంగన్వాడీ భవనం, రూ.15 లక్షలతో 9వ వార్డులో నిర్మించిన అంగన్వాడీ భవనం, రూ.25 లక్షలతో 19వ వార్డులో నిర్మించిన డ్వా క్రా, అంగన్వాడీ భవనం, రూ.15 లక్షలతో 34వ వార్డులో నిర్మించిన అంగన్వాడీ భవనం, రూ.8.50 లక్షలతో ఎల్మకన్యలో నిర్మించిన ఆరోగ్యకేంద్రం, రూ.7.50 లక్షలతో నిర్మించిన మీ సేవ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందు చూపుతో పరిపాలన చేయడంతో నేడు రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు.
ఒకప్పుడు వానకాలం వస్తే పల్లెలు రోగాలతో వణికిపోయేవని, మిషన్ భగీరథ, పల్లెప్రగతి తదితర కార్యక్రమాలతో ఆ పరిస్థితి నేడు లేదన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు పరిశుభ్రంగా మారడంతో సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా మార్చామన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తే.. దేశం అనుసరించేదనే నానుడి ఉండేదని… నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్తోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. అందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మకండి
తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ మాటలు ప్రజలు నమ్మరాదన్నా రు. వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీవి అన్నారు. ఆరు దశాబ్దాలు పాలించిన ఏమి చేయకుండా మళ్లీ ఆరు గ్యారంటీలా..? ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు ప్రజలు నమ్మి మోసపోరాదని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో తాండూరుకు రూ.వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని మళ్లీ తాండూరులో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రూ.లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి తాండూరును రాష్ట్రంలో ఆదర్శంగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ, వైస్ చైర్మన్ ఉమాశంకర్, ఎంపీపీ లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం
తాండూరు : నాందేడ్-పర్భాణి ఎక్స్ప్రెస్ రైలును తాండూరు నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వరకు పొడిగించడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని సమాచార పౌర సంబంధాలు, గనులు, భూ గర్భవనరుల శాఖల మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో నాందేడ్-పర్భాణి ఎక్స్ప్రెస్ రైలును తాండూరు-రాయచూర్కు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మా ట్లాడుతూ రాయచూర్ వెళ్లేందుకు ఇప్పటి వరకు రాయలసీమ, బీదర్, యశ్వంతపూర్, నాందేడ్ వైపు రైళ్లు మాత్రమే అందుబాటు లో ఉండేవన్నారు.
తాజాగా తాండూరు వర కు వచ్చిపోయే 17664/17663 నాందేడ్-పర్భాణి ఎక్స్ప్రైస్ రైలును కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వరకు పొడిగించడం సంతోషమన్నారు. దీంతో ప్రయాణికులకు మరింత మే లు జరుగుతుందన్నారు. రైల్వే శాఖ అధికారు లు మాట్లాడుతూ ఇప్పటివరకు తాండూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ అయ్యే నాందేడ్-పర్భాణి ఎక్స్ప్రెస్ ఇకపై తాండూరులో కొద్ది సేపు మాత్రమే ఆగి రాయచూర్ వైపు వెళ్తుందన్నారు. అలాగే మహారాష్ట్రలోని పర్భాణి నుంచి రాత్రి 10.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తాండూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాం డూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.