రంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర సర్కార్కు రెండు కండ్ల వంటివి.. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే నిదర్శనం..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని ఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రతి లావాదేవీపైనా జీఎస్టీ విధిస్తూ సామాన్యులపై భారం మోపుతుందన్నారు. బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ మాట్లాడుతూ ‘మిషన్ భగీరథ’తో చెరువుల పునరుద్ధరణ, పలు ప్రాజెక్టులు, చెక్ డ్యాంల నిర్మాణాలతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఇందుకు ఇటీవల కేంద్ర ప్ర భుత్వం ప్రకటించిన పంచాయతీ పురస్కారాలే నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఎన్ గార్డెన్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. దీనికి ముఖ్యఅతిథులుగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, పార్టీ రంగారె డ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాంటివని పేర్కొ న్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. రా ష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతున్నదని ప్రజలంద రూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వందలాది గురుకులాలను నెలకొల్పి ఒక్కో విద్యార్థిపై రూ.1,20,000 ప్రభుత్వం వెచ్చిస్తున్నదని తెలిపారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, గృహలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. తొ మ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఏమీ చేయలేదని.. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. కానీ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే కాకుండా ఇతర అభివృద్ధి పనులనూ చేపట్టారని కొనియాడారు.
కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కు టుంబమంతా పాల్గొన్నది. కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పోరాటాల్లో పాల్గొన్నారు.. కొన్నిసార్లు అరస్టై పలు ఠాణాలో నూ ఉన్నారు. ఈ విషయాలు విమర్శించే వారికి తెలియదు. 24 గంటలపాటు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై లేని పోని ఆరోపణలు చేస్తుంటారు. వారు ఉద్యమంలో ఉన్నప్పుడు మాట్లాడ ని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి విఘాతంగా మారిందని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకుండా ప్రతి లావాదేవీపైనా జీఎస్టీని విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. కల్లబొల్లి మాటలు చెప్పి దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నదని.. బీజేపీ ప్రభుత్వానికి మనం ఎంత దూరం ఉంటే అంత మం చిదని ప్రజలకు హితవు పలికారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మనకు రక్ష అని.. ఆయనకు మద్దతుగా నిలిచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అందుకోసం ప్రభు త్వ పథకాలను ఇంటింటికీ తిరిగి వివరించాలనిబీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆమె సూ చించారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాద వ్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని అభినందించారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిని అభివృద్ధి చెందుతున్నదని.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు ఓర్వడంలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన పేర్కొన్నారు. షాద్నగర్లో అంజయ్యయాదవ్ మూడోసారి విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు.
పెరిగిన ప్రజల సంపద షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణంతోపాటు ప్రజల సంపద కూడా పెరిగిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని ఎల్ఎన్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించిన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు వంటి పథకాలతో పేదలు సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 29 వేల ఉద్యోగాలు ఇస్తే.. ఈ ఎనిమిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రంగారెడ్డి జిల్లాలో కొత్త, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని.. వేలాది మందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, రాజావరప్రసాద్, రాంబాల్నాయక్, రాజ్యలక్ష్మి, మహేశ్వరి, నారాయణ, ఎల్ఎన్ రెడ్డి, బక్కన్నయాదవ్, కిశోర్, సుధాకర్, లక్ష్మణ్నాయక్, వెంకట్రాంరెడ్డి, సర్వర్పాషా, జమృత్ఖాన్, శ్రీనివాస్గౌడ్, సాధిక్, మల్లేశ్, వేణుగోపాల్, అంతయ్య, శేఖర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.