బొంరాస్ పేట్ : మండలంలోని ఎన్నెమీదితండా (వడిచెర్ల) ఉప సర్పంచ్ రతన్ నాయక్, నలుగురు వార్డు సభ్యులు, 40 మంది కార్యకర్తలు శనివారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలు టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ తాలుకా, మండల యూత్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, మహేందర్, పార్టీ నాయకులు దేశ్యానాయక్, టీటీ రాములు, ఖాజా మైనుద్దీన్, డాక్యానాయక్, నర్సింహ రాథోడ్ పాల్గొన్నారు.