వికారాబాద్, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వ ఉద్యోగులపై గొడ్డలి పెట్టు లాంటివని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శివకుమార్ మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా, అసోసియేట్ అధ్యక్షుడు నర్సింలు, కోశాధికారి రమేశ్, వికారాబాద్ తాలూకా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అరుణ కుమారి, జాయింట్ సెక్రటరీ ఉమెన్ శ్రావణి, జాయింట్ సెక్రటరీలు హీరలాల్, సాయి కుమార్, ఆఫీస్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.