బడంగ్పేట, అక్టోబర్ 18: మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగూడకు చెందిన 200 మంది బీజేపీ నాయకులు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. పల్లె, పట్టణాల్లో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు సంబంధించిన అనేక పథకాలను ప్రవేశపెట్టడం వలన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ఇతర పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న వారు ఏం చేస్తారో ప్రజలకు చెప్పడం లేదన్నారు. కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు రవినాయక్, సుమన్, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ అధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ నాయకులు రాజు, సురేశ్, నర్సింహారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్, శ్రీలత, పద్మ ఉన్నారు.