పరిగి, మార్చి 28: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని ఎమ్మెల్యే స్వగృహంలో పరిగి మండలం రూప్ఖాన్పేట్ గ్రామానికి చెందిన గాలిగూడెం రాంచందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో బీజేపీ నుంచి ఉపసర్పంచ్ కాకి యాదమ్మ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎం.డి.షకీల్, మెత్తటి శేఖర్, పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికే తలమానికంగా తెలంగాణలో పలు సంక్షేమ పథకాలు అత్యంత పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 86 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.53.25లక్షలు, అయిదు మందికి రూ. 15లక్షలకు సంబంధించిన ఎల్వోసీలు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓవైపు సర్కారు దవాఖానలను పటిష్టవంతం చేయడం తోపాటు కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తుందన్నారు. పరిగిలోని 2వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వార్డు పరిధిలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే గృహలక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందజేస్తామని స్థలం ఉన్న పేదలు ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.