దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చేస్తుండగా, రూ. 10వేలను రక్షణ నిధి కోసం వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన 697 మంది లబ్ధిదారులకు ఇప్పటికే ఆయా యూనిట్లను కేటాయించగా ఆర్థికంగా రాణిస్తున్నారు. పలువురు డెయిరీ ఫామ్స్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, క్యాబ్లు కొనుగోలు చేసి నెలకు రూ.30 నుంచి రూ.60 వేల వరకు సంపాదిస్తూనే మరింతమందికి పని కల్పిస్తున్నారు. ఇదివరకు కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేస్తూ చాలీచాలని డబ్బులతో దుర్భరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని.. దళితబంధు పథకంతో నేడు స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని సంతోషంగా బతుకుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు పలువురు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
-రంగారెడ్డి, మే 25(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 25 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం నిరుపేద దళితుల జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ పకడ్బందీగా బతుకు దారులను చూపుతున్నది. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రూ.10లక్షలు అంటే రూ. 9,90,000 ఎంపిక చేసిన పథకానికి ఖర్చు చేస్తుండగా మిగిలిన రూ. పది వేలను రక్షణ నిధి కోసం కేటాయిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం అమలుకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నది. ఈ పథకం ద్వారా దళితులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది.
ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. అయితే, రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 697 యూనిట్లకుగాను ఇప్పటికే లబ్ధిదారులకు నిర్ణీత మొత్తాన్ని కేటాయించడం జరిగింది. అయితే, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో 100 చొప్పున ఇప్పటికే 400 యూనిట్లను ఎంపిక చేశారు. కాగా, చేవెళ్లలో 82 యూనిట్లు, ఎల్బీ న గర్లో 81 యూనిట్లు, శేరిలింగంపల్లిలో 72 యూనిట్లు, కల్వకుర్తిలో 62 యూనిట్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. కాగా, ఆయా యూనిట్ల ద్వారా లబ్ధిదారులు ఇప్పటికే లబ్ధి పొందుతూ, తమ కుటుంబాలను సాధుతూ, తోటి వారికి భృతి కల్పిస్తున్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు..
జిల్లాలో ఇప్పటికే 697 యూనిట్లతో దళిత కుటుంబాల్లో బతుకు దారులు ఏర్పడి, వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. లబ్ధిదారులు తమకు నచ్చిన.. తమకు అనుభవం ఉన్న యూనిట్ల (డెయిరీఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర)ను ఎంచుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రతినెలా రూ. 30
నుంచి రూ.60 వేల పైనే ఆర్జి
స్తున్నామని లబ్ధిదారులు చెబుతూ సంబురపడుతున్నారు. ఇదివరకు కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేస్తూ చాలిచాలనీ డబ్బులతో దుర్భరమైన జీవితా న్ని గడిపేవాళ్లమని.. దళితబంధు పథకం పుణ్యమా నేడు స్వయం ఉపాధిని ఏర్పా టు చేసుకొని సంతోషంగా బతుకుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. గతంలో నెల రోజులపాటు పని చేసినా అరకొర ఆదా యం వచ్చేదని.. దాంతో కుటుంబ పోషణే భా రంగా మారేందని వారు చెబుతున్నారు. ప్రభు త్వం అందించిన తోడ్పాటుకు తాము జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. తాము నెలకొల్పిన యూనిట్ల ద్వారా మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత మంచి పథకాన్ని అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వం..
నేను దళిత బంధు పథకంలో ట్రాక్టర్ తీసుకున్న. ఉపాధి పొందుతూనే.. పరోక్షంగా మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నా. గతంలో పని లేక ఉపాధి కోసం ఎదురు చూసిన. ప్రస్తుతం చేతినిండా పని ఉన్నది. దళితబంధుతో సీఎం కేసీఆర్ మా బతుకులకు భరోసా కల్పించారు. సీఎం సార్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ దళితులను పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కార్ ముందుకెళ్తున్నది.
– ఎ.నర్సింహులు, లబ్ధిదారుడు, ఆలూరు గ్రామం, చేవెళ్ల మండలం
రూ.20 వేల వరకు సంపాదిస్తున్నా..
సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టితో చూస్తూ ఆర్థికంగా ఎదిగేలా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆదుకుంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు దళితులను పట్టించుకోలేదు. గతంలో పని దొరకాలన్నా.. ఎక్కడైనా చిన్నపాటి ఉద్యోగాన్ని పొందాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేంది. కానీ.. నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉపాధిని కల్పిస్తున్నది. ప్రస్తుతం నేను దళితబంధు పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా. ఈ పథకం క్రింద ఎనిమిది గేదెలను తీసుకొని సొంతంగా డెయిరీఫామ్ను ఏర్పాటు చేసుకున్నా. నెలకు అన్ని ఖర్చులు పోను రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నా. స్వయం ఉపాధి దిశగా ప్రభుత్వం ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది.
– కె.జనార్దన్, లబ్ధిదారుడు, ఈర్లపల్లి
మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నా..
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో చేద్దామంటే పనులు దొరకని పరిస్థితి ఉండేది. ఎక్కడైనా పని దొరికితే తగిన భత్యం వచ్చేదికాదు. శ్రమ దోపిడీకి గురయ్యేవారిమి. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నాలాం టి వారికి మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలు, నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి దళితుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. నేను కూడా దళితబంధు క్రింద లబ్ధిదారుడిగా ఎంపికై ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ను
తీసుకున్నా.. దానితో నా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చూసుకుంటున్నా. మరి కొందరికి ఉపాధిని కల్పిస్తున్నా.
– తంగెడిపల్లి పోచయ్య, కమ్మెట గ్రామం