తాండూరు, నవంబర్ 1: గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కులమతాలకు అతీంగా బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డి మద్దతు పలుకుతున్నారు. నీ వెంటే మేము..మీ గెలుపు మా భరోసా అంటూ హామీ ఇస్తున్నారు. దీంతో తాండూరులో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారాయి. తాండూరులో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై… భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపట్ట డంతో ప్రజలు, వివిధ కుల సంఘాలు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం చాల సం తోషమని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం నియోజకవర్గంలోని తాండూ రు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల విశ్వకర్మలు, బీసీ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు సంపూర్ణ మద్దతు ప్రకటిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ వివిధ సంఘాల ప్రతినిధులు తనను కలిసి ఆశీర్వదిస్తూ మద్దతు తెలుపుడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాండూరు అభివృద్ధికి బీఆర్ఎస్లోకి స్వచ్ఛందంగా వస్తుండడం అభినందనీయమన్నా రు. మంచి మనస్సుతో ‘కారు’ గుర్తుకు ఓటు వేసి మళ్లీ గెలిపిస్తే తాండూరు నియోజక వర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు కనిపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ఎవరు నమ్మరాదని సూచించారు. ప్రతి నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సంక్షేమం, తాండూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తనను ప్రజలందరు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తాండూరు, నవంబర్ 1: బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కార్ చేయూతనిస్తున్నదని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్తో పాటు కుల గణన, జన గణన చేపట్టాలని బీజేపీ, కాంగ్రెస్ను కోరితే పట్టించుకోలేదని బీసీ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాండూరు నియోజక వర్గ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీతో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 70 ఏండ్లుగా ఏమీ చేయని కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు బీసీలకు మేలు చేస్తామని చెప్పడం హాస్యా స్పదంగా ఉన్నదని తెలిపారు. మొదట కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పర్చారని అన్నారు. మత్స్య, నేత, గీత, యాదవ, రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వకర్మ, అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలను ఆదుకున్న ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. బీసీలకు అండగా నిలిచిన ప్రభుత్వానికి బహుజనులు కూడ అండగా నిలుస్తారని చెప్పారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బీసీల డిమాండ్లను గుర్తించి సేవలు చేశారని తెలిపారు. ముఖ్యంగా రూ. 2 కోట్ల నిధులతో తాండూరులో బీసీ సమీకృత భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. అర్హులైన బీసీలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత కల్పించి ఆదుకున్నారని పేర్కొన్నారు.
తాండూరు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిరంతరం సేవకుడిలా పనిచేస్తున్న రోహిత్రెడ్డికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతు ప్రకటించారని తెలిపారు. దీంతో తాండూరులో బీసీ సంఘం కూడ బీఆర్ఎస్ అభ్యర్థి పంజుగుల రోహిత్రెడ్డికి మద్దతు తెలుపుతూ అత్యధిక మెజార్టీతో విజయం సాధించుటకు బీసీ సంఘం ఆధ్వర్యంలో గడపగపకూ ప్రచారం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు సయ్యద్ షుకుర్, వెంకటేశ్, జ్యోతి, బసంత్, లక్ష్మణ్చారి, శ్రావణ్, నరేందర్, రజక సంఘం జిల్లా కన్వీనర్ కృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పరమేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్న, కుమ్మరి సంఘం ప్రతినిధి శంకర్, రాజ్పుత్ సంఘం ప్రతినిధి బాలాజీ తదితరులున్నారు.