బంట్వారం : మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన యువ రైతు అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకున్న బిచ్చిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, పిల్లల విద్యా ఖర్చులన్నీ తానే భరిస్తానని ఎంపీ రంజీత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకోవడం సోషల్ మీడియాలో చూసి, చలించానన్నారు. పంటలు నష్టపోయాయని, ఇతరాత్ర సమస్యలు ఏమైన ఉంటే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, లేదా మిత్రులు, శ్రేయోభిలాషిల సలహాలు తీసుకోవాలి తప్ప, ఆత్మ హత్యలకు పాల్పడరాదని సూచించారు.
ఏది ఏమైన బిచ్చిరెడ్డి మృతితో భార్య, పిల్లలు అనాథలైనారని సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందే సహాయ సహాకారాలన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే కాక వారి పిల్లల భవిష్యత్తులో ఉన్నత విద్యా, ఎంతవరకు చదివిన అంతవరకు తాను విద్యా ఖర్చులను భరిస్తానని చెప్పారు. త్వరలో వారి కుటుంబాన్ని సందర్శించి, పరమార్శిస్తానని తెలిపారు.