భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బీజేపీ డౌన్డౌన్.. బండి సంజయ్ డౌన్డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరగడాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆయన మహిళలతోపాటు ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో తిరుగనివ్వమని హెచ్చరించారు.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభు త్వం ఈడీ నోటీసులు పంపిస్తున్నదని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసి..అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజూనాయక్, ప్రధానకార్యదర్శులు అంజయ్య, రాజూగుప్తా, నాయకులు వేణుగోపాల్రెడ్డి, వెంకటయ్య, జైపాల్రెడ్డి, సుధాకర్గౌడ్, అంజయ్య, సంతోష్కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సుభాన్రెడ్డి, సురేశ్, రవిశంకర్, భక్తవత్సల పాల్గొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్ ఆధ్యర్యంలో ధర్నా చేసి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నర్సిం హులు, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, సర్పంచ్లు మల్లారెడ్డి, నరహరిరెడ్డి, వెంకటేశ్, కృష్ణ, సాయికుమార్, రవి, నరేందర్గౌడ్ పాల్గొన్నారు.
తాం డూరులో జరిగిన నిరసనలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డితోపాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో బీజేపీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ పాల్గొని ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు. మొయినాబాద్ మం డల కేంద్రంలో ఎంపీపీ నక్షత్రం, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవం త్, ఏఎంసీ వైస్ చైర్మన్ రావూఫ్, మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో తోలుకట్ట్ట సర్పంచ్ శ్రీనివాస్, రాఘవేందర్యాదవ్, రాజూగౌడ్,పరమేశ్ పాల్గొన్నారు. పరిగిలో ఎంపీపీ అరవింద్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యం లో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి ..అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సుల్తాన్పూర్ ఎంపీటీసీ వెంకట్రాంరెడ్డి, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, మునీర్, నాగేశ్వర్, రవికుమార్, సంతోష్ పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామూనాయక్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. కార్యక్రమంలో జయమ్మ, శివ, రవి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి ,బీఆర్ఎస్ నాయకులు యాదగిరి, బుగ్గరాములు ఆధ్వర్యం లో సాగర్ రహదారిపై బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో భరత్రెడ్డి, సర్పంచ్ యాదగిరి, గణేశ్, బీరప్ప, రవీందర్రెడ్డి, మైసయ్య, శేఖర్గౌడ్, జహీర్, విజయ్ కుమార్, కరుణాకర్రెడ్డి, దేవేందర్గౌడ్ పాల్గొన్నారు.