షాబాద్, నవంబర్ 25: తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందించడంతోపాటు వారి కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 1,309 ప్రభుత్వ పాఠశాలలుండగా.. అందులోని 1.60 లక్షలమంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు చేపట్టింది. నిర్వాహకులు వంట వండిన తర్వాత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం సమతుల ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది.
ఇం దుకోసం ఈ విద్యాసంవత్సరం నుంచే మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ రైస్ను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికీ భోజనం నిమిత్తం రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థీ భోజనానికి రూ.8.13 చెల్లిస్తున్నది. గతంలో ఒక గుడ్డుకు రూ.4 ఇవ్వగా, ప్రస్తుతం దానిని రూ.5కు పెంచింది. ప్రతిరోజూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రా జేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 1,309 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రభుత్వం 1.60 లక్షల మంది పేద విద్యార్థులకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నది. సోమవారం అన్నం, గుడ్డు, సాంబారు.. మం గళవారం అన్నం, కూరగాయల కూర.. బుధవారం అన్నం, గుడ్డు, పప్పు.. గురువారం అన్నం, ఆకుకూర, సాంబారు. శుక్రవారం అన్నం, గుడ్డు, కూరగాయల కూర.. శనివారం అన్నం, ఆకుకూర, పప్పు తో మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టిని సారించింది.
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల్లోపు ఆ రోజు బడికి వచ్చిన విద్యార్థుల సంఖ్యను లెక్కించి.. మధ్యా హ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు చెబుతారు. ఆ సంఖ్యను బట్టి మధ్యాహ్నం లోపు నిర్వాహకులు భోజనాన్ని సిద్ధం చేస్తారు. వండిన ఆహారాన్ని ముం దుగా ఉపాధ్యాయులు రుచి చూస్తున్నారు. ఒక్కో విద్యార్థికీ ప్రతిరోజూ 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయలు పెడు తూ నిర్వాహకులు పక్కాగా నిబంధనలు పాటిస్తున్నారు. వారికి కూడా సకాలంలో నిధులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
మా పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం ప్రతి రోజూ వడ్డిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడిగుడ్డు పెడుతున్నారు. ముందుగా మా టీచర్లు రుచి చూశాకే మాకు భోజనాన్ని వడ్డిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందించడం సంతోషకరం.
-కావ్య, విద్యార్థిని, షాబాద్ బాలికల పాఠశాల
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం ప్రతిరోజూ అందుతున్నది. జిల్లాలోని 1,309 ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. తద్వారా జిల్లాలోని1.60 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
-సుశీందర్రావు, రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి