కొడంగల్, జూన్ 14 : ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల, ప్రభుత్వ సీహెచ్సీ దవాఖాన తదితర భవనాలను పరిశీలించి ఏర్పాట్లుపై అధికారులతో ఆరా తీశారు.
దవాఖానలో డయాలసీస్ సెంటర్లో పరికరాలను త్వరగా బిగించి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. 15వేల మంది జనాభా తరలిరానున్నారని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు చాంద్పాషా, నవాజుద్దీన్, సాయిలు, రమేశ్బాబు, టీటీ రాములు పాల్గొన్నారు.