కడ్తాల్, డిసెంబర్ 20 : మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మ హేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహా యాగం-2 సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పిరమిడ్ స్పిరిచ్చువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 31 వరకు 11 రోజులపాటు నిర్వహించే ధ్యాన మహాయాగ సభలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ధ్యాన సభలకు వివిధ ప్రాంతాల నుంచి పిరమిడ్ మాస్టర్లు, అధ్యాత్మిక వేత్తలు, ధ్యాన గురువులు హాజరవుతున్నట్లు పిరమిడ్ ట్రస్టు చైర్మన్ విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ధ్యాను లకు పిరమిడ్ ఆవరణలో ఉచిత వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
పిరమిడ్ ఆవరణ లో సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాను ఏర్పా టు చేశారు. ధ్యాన కార్యక్రమాలను వీక్షించడానికి సభా ప్రాంగణంలో నిర్వాహకులు ప్రత్యేక ఏ ర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం పత్రీజీ సతీమణి స్వర్ణమాల జ్యోతి ప్రజ్వలన చేసి మహా సభలను ప్రారంభిస్తారని విజయభాస్కర్రెడ్డి తెలి పారు. ప్రతి రోజు ఉదయం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విద్యాంసులచే అఖండ ధ్యానం, సుభాశ్ పత్రీజీ వీడియో సందేశం, ఉద యం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆధ్యా త్మిక ప్రవచనాలు, గురువుల సమ్మేళనం, సాం స్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ట్రస్టు చైర్మన్ వివరించారు.