పరిగి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 44మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 37,71,200లకు సంబంధించిన చెక్కులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కారు దవాఖానలను పటిష్టం చేసి మరింత నాణ్యమైన వైద్యసేవలు అందజేస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు చేయించుకున్న పేదలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పరిగి, కులకచర్ల, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, సత్యమ్మ, పూడూరు జడ్పీటీసీ మేఘమాల, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు.