ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు, మాడ్గుల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ, గ్రామాన ప్రచారం చేసి పార్టీ పటిష్టతను పెంచేలా కార్యకర్త లు నడుం బిగించాలన్నారు. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి పార్టీ ప్రతిష్టతను పెంచాలన్నారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులంతా అందరితో సమన్వయం చేసుకొని ముందుకు నడువాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, నాయకులు లాలయ్యగౌడ్, రవితేజ, జైపాల్నాయక్, అంబాల జంగయ్య, యాదిరెడ్డి, పవన్కుమార్, ధర్మారెడ్డి, సుభాశ్, వెంకటయ్యలు పాల్గొన్నారు.