ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు. తలకొండపల్లి మండలంలోని వెంకట్రావ్పేట్, జంగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఆయనను సత్కరించారు.
అనంతరం మాడ్గుల మండలంలోని నాగిళ్ల, మాడ్గుల మండల కేంద్రాలకు చెందిన బాధితులు సునీల్గౌడ్ రూ. 34వేలు, గీతకు 28వేలు, అరుణ రూ. 15వేలు, భారతమ్మకు రూ. 35వేలు సీఎం రిలిఫ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రఘురాములు, జంగయ్య, సత్తయ్యగౌడ్లు పాల్గొన్నారు.