కొడంగల్, జనవరి 25 : ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కలిసి అధికారులు నిర్వహించిన ర్యాలీని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కూరగాయల మార్కెట్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఓటరు నినాదాలతో పట్టణమంతా మార్మోగింది. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వృద్ధ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కును పొందిన వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును పొంది ఉండాలన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి నవ సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీవో పాండు, ఎంఈవో రాంరెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి. డిప్యూటీ తహసీల్దార్లు సురేశ్కుమార్, శివకుమార్తో పాటు రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
తాండూరు: ఓటర్ డే ను పురస్కరించుకొని విద్యాలయాల్లో మాక్ ఎన్నికలు నిర్వహించారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుం డా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అధికారులు, నేతలు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజా స్వామ్యా నికి ఓటు పునాది వంటిదని, ఓటర్లు చైతన్యవంతులై ఉండాలన్నారు.
బొంరాస్పేట: ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకో వాలని, మంచి చేసే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ రవి కుమార్, ఆర్ఐ రవిచారి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా ఉన్నత పాఠశాల నుంచి భూలక్ష్మీ దేవాలయం చౌరస్తా వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ పౌరులుగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెడుతూ ప్రతి ఎన్నికల్లో ఒత్తిడులకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్లు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎం హరిలాల్, పీడీ పాపిరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
దోమ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులు విద్యార్థులకు, ఓటర్లకు ఓటు ప్రాముఖ్యతను వివరిం చారు. అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఆర్ఐ సుదర్శన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్: సమాజంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని డిప్యూ టీ తహసీల్దార్ మహేశ్, ఆర్ఐ రాజూరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గులు, డ్రా యింగ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అంతకు ముందు అవగాహన ర్యాలీని నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులందరూ ఓట హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల లైబ్రెరియన్ కృష్ణయ్య, అధ్యాపకులు అన్వర్, అనిల్, జమీల్, శ్రీను, నర్సింహులు, ప్రభాకర్ రెడ్డి, స్వప్న, స్రవంతి, యాదమ్మ, సునీత, మాధవరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట: జాతీయ ఓటరు దినోత్సవాన్ని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జయరాం మాట్లాడుతూ ఓటు హక్కుతోనే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం కలుగుతుందని దానిని సద్వినియోగం చేసుకోవాలని గుర్తుజేశారు. అనంతరం మండలంలో అత్యధికసార్లు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రజితారాణి, సుశీల్కుమార్, మోహన్, బీఎల్వోలు, పంచాయతీ సెక్రటరీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మర్పల్లి: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని తహసీల్దార్ గణేశ్ అన్నారు. మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహ సీల్దార్ కార్యాలయ ఆవరణ లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విద్యాసాగర్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, పం చాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, ఆర్ఐలు మాధవరెడ్డి, దశరథ్, సిబ్బంది గోపాల్, శివ, పాపయ్య, శ్రీహరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరిగి టౌన్: ఓటు ఎంతో విలువైనదని ఆర్డీవో విజయకుమారి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వా రం పరిగిలో సీనియర్ సిటిజన్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్రావు, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
కులకచర్ల : చౌడాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులను తహసీల్దార్ ప్రభు ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఐ లింగయ్య, సర్పంచ్ కొత్త రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు తావుర్యానాయక్, పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ శివకుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.