విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అబ్దుల్లాపూర్మెట్లోని సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అరుదైన ఘనత దక్కింది. ఏటా గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కార్ అందజేసే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట కృష్ణారావు, సీనియర్ లెక్చరర్ బి.వజ్రయ్యలు ఎంపికయ్యారు. వీరికి నేడు జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అవార్డులను అందజేయనున్నారు. అంతేకాకుండా విద్యార్థులను ఉత్తమ ఇంజినీర్లుగా తీర్చిదిద్దడంతో ఈ కళాశాలకు గత ఏడాది డిసెంబర్లో ఎన్బీఏ గుర్తింపు సైతం లభించింది. నూటికి నూరు శాతం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ కళాశాల కేరాఫ్గా నిలుస్తుండడం గమనార్హం.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అబ్దుల్లాపూర్మెట్లోని సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాటలు వేస్తున్నది. విద్యార్థుల ప్రగతిపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నైపుణ్యం పెం పొందించి స్వయం ఉపాధితోపాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలను ఈ కళాశాల కల్పిస్తున్నది. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు బోధిస్తుండడంతో అవకాశా లు వెతుక్కుంటూ వస్తున్నాయనేందుకు ఈ కళాశాల సాక్ష్యంగా నిలుస్తున్నది. 1984 సంవత్సరంలో ఆటోనగర్ నుంచి కళాశాల ప్రస్థానం మొదలైంది. 1996 నుంచి కళాశాలను అబ్దుల్లాపూర్మెట్కు తరలించి ఆహ్లాదకర వాతావరణంలో తరగతులను నిర్వహిస్తున్నారు. 40 మంది వరకు ఉన్న నిష్ణాతులైన అధ్యాపకులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ప్రతి యేటా నూటికి నూరు శాతం అత్యుత్తమ ఫలితాలు రావడంతోపాటు చాలామంది విద్యార్థులు 95కు పైగా క్రెడిట్లు సాధిస్తున్నారు. ఎన్బీఏ గుర్తింపు..
అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధనతో విద్యార్థులను ఉ త్తమ ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్న ఎస్జీఎం కళాశాలకు గతేడాది డిసెంబర్లో ఎన్బీఏ గుర్తింపు లభించింది. ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు సాంకేతిక వి ద్యను అందించడంతోపాటు క్రీడల్లోనూ రాణించేలా కళాశాల లో చర్యలు తీసుకుంటున్నారు. హరితహారం వంటి సామాజిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను చేపడుతూ కళాశాల ప్రతిష్టను ఇనుమడింప జేస్తున్నారు. కళాశాలను సందర్శించిన ఎన్బీఏ బృందం కళాశాలలోని వసతులు, సౌకర్యా లు, విద్యా నాణ్యత, ఉపాధి అవకాశాలు ఇతర అంశాలను స మగ్రంగా పరిశీలించి గుర్తింపును ఇచ్చింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ గుర్తింపును తెలంగాణలోనే మొదటిసారిగా దక్కించుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప లు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఇక్కడి కళాశాలను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ స్ఫూర్తితోనే 20 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్బీఏ గుర్తింపును సాధించాయి.
ఈ ఏడాది గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క ళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట కృష్ణారావు, సీనియర్ లెక్చరర్ బి.వజ్రయ్యను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపిక చే సింది. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సం దర్భంగా అందించిన అవార్డులు సైతం వీరిద్దరికే దక్కడం విశే షం. వీరిద్దరూ 2018 సంవత్సరంలో కళాశాలలో బాధ్యతలు స్వీకరించగా.. ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట కృష్ణారావు ఓ వైపు కళాశాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తూనే… ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిప్లొమాలో నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ మోటా ర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న అనేక మంది తన వద్ద శిష్యరికం పొందిన వారేనని ప్రిన్సిపాల్ గర్వంగా చెబుతారు. అలాగే కం ప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సును వినూత్న పద్ధతుల ద్వారా బోధిస్తూ సీనియర్ లెక్చరర్ బి.వజ్రయ్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నారు. ప్రాక్టికల్స్కు సంబంధించి సొంతంగా 50 వీడియోలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నెట్లో కంప్యూటర్ ఆధారిత పాఠాలకు సంబంధించిన వీడియోలను సైతం విద్యార్థులకు చేరువ చేసి నైపుణ్యతను పెం పొందిస్తున్నారు. ఏకకాలంలో ఇద్దరికీ రాష్ట్రస్థాయి అవార్డులు రావడంపై అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘నాణ్యమైన బోధన.. ఉత్తమ ఫలితాలు.. విద్యార్థుల భవిష్యత్తుకు కల్పిస్తున్న భరోసా.. వెరసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (ఎస్జీఎం) కళాశాల ప్రత్యేకతను చాటుకుంటున్నది. అనేక కళాశాలలతో పోటీ పడి గతేడాది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణలోనే మొదటిసారిగా అరుదైన నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపును పొందింది. ఈ కోవలోనే.. రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకట కృష్ణారావు, సీనియర్ లెక్చరర్ బి.వజ్రయ్యకు వరించాయి. సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు.’
గతేడాది కళాశాలకు ఎన్బీఏ గుర్తిం పు వచ్చింది. ఈ ఏడాది నాతో పా టు సీనియర్ లెక్చరర్కు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉం ది. సమష్టి కృషి ఫలితంగానే ప్రత్యేక గుర్తింపును పొందగలుగుతున్నాం. ఇక్కడ చదువు పూర్తయ్యేలోపు విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా వివిధ కోర్సు ల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. కళాశాలకు ఎన్బీఏ గుర్తిం పు రావడంతో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
– సీహెచ్ వెంకట కృష్ణారావు, కళాశాల ప్రిన్సిపాల్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో వినూత్న బోధనా పద్ధతుల ను అవలంభిస్తున్నాను. హెచ్వోడీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించి వి ద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నా. ప్రాక్టికల్స్ సులభతరంగా అర్థమయ్యేలా సొం తంగా 50 వరకు వీడియోలను రూపొందించా. ఇక్కడ చది వి ఉత్తీర్ణులైనవారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇంజినీరింగ్లో టాప్టెన్ కాలేజీల్లోనూ సీట్లను దక్కించుకుంటుండడం గర్వకారణం.
– బి.వజ్రయ్య, సీనియర్ లెక్చరర్