పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 95 బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 69 వనాల పనులు పూర్తికాగా, మరో 26 ప్రాంతాల్లో పనులు తుదిదశకు చేరాయి. ఫిబ్రవరిలోగా వందశాతం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఒక్కో వనంలో 31 రకాలకు చెందిన 20 నుంచి 30 వేల మొక్కలను నాటేలా చొరవ తీసుకుంటున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో వనానికి రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఖర్చుచేస్తున్నారు.
-వికారాబాద్, జవవరి 6 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ): తెలంగాణ అంతటా పచ్చదనం పరిఢవిల్లేలా రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిఏటా తెలంగాణకు హరితహారంలో భాగంగా మొ క్కలు నాటుతూ సంరక్షణకు చర్యలు తీసుకుం టున్నది. మండలానికి నాలుగైదు బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామానికి ఒక పల్లెప్రకృతివనాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ప్రతి మండలానికీ ఒక బృహత్ పల్లెప్రకృతివనాల ఏర్పాటు ప్ర క్రియ తుది దశకు చేరుకున్నది. ప్రధానంగా యా దాద్రి ఫారెస్ట్ మాడల్ను ప్రతి మండలంలోనూ పాటించి చిట్టడవులను సృష్టించేందుకు చర్యలను ముమ్మరం చేసింది.
ప్రతి మండలంలోనూ నాలుగైదు బృహత్ పల్లెప్రకృతి వనాలను ఐదు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బృహత్ పల్లెప్రకృతివనంలో 20-30 వేల మొక్కలను నాటుతున్నారు. అం దులో నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలు ఉం డనున్నాయి. అయితే వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 95 బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే వాటిలో ఇప్పటికే 80శాతం బృహత్ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికాగా .. మిగతావి ఫిబ్రవరిలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
చిట్టడవుల్లా బృహత్ ప్రకృతి వనాలు..
బృహత్ పల్లెప్రకృతి వనాలను 5-10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృహత్ పల్లెప్రకృతివనం(బీపీపీవీ) నిర్మాణానికి ప్రభుత్వం రూ.35 నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది. ఇందులో పొడవు, పొట్టి, మధ్యస్థ జాతి మొక్కలు కలిపి మొత్తం 20-30 వేల మొక్కలను నాటుతున్నారు. ఊరుకు సమీపంలోనే బీపీపీవీలను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ఔషధ మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. 31 రకాల మొక్కల్లో చింత, వేప, కానుగ, నేరేడు, గోరింట, గుల్మార్, జామ, దానిమ్మ, సీతాఫలం, సీమచింత, మునగ, ఎర్రగడ్డి, మర్రి, వెదురు, రావి, రైన్చెట్టు, విప్ప, బొప్పాయి, ఫిబ్రవరి ఫ్లవర్, బిల్వపత్రం, మేడి, గాంచుసీమ, టెకోమా, మద్ది, పనస, మారే డు తదితర రకాల మొక్కలను నాటుతున్నారు. అంతేకాకుండా పిల్లలు ఆడుకునేందుకు ఎకరా స్థలంలో ఆటస్థలాన్ని, వాకింగ్ చేసేందుకు వాకింగ్ట్రాక్ను, సేద తీరేందుకు కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 95 బృహత్ ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 69 బీపీపీలు అందుబాటులోకి రాగా.. మిగతా 26 వనాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. రాను న్న రెండ్లేండ్లలో బృహత్ వనాలు చిట్టడవుల్లా మారనున్నాయి.
పచ్చదనం పెంపే లక్ష్యంగా..
పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం పల్లెప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు పూర్తై, వాటి ఫలితాలను ప్రజలు పొందుతుండగా ..మండలానికి నాలుగైదు బృహత్ పల్లెప్రకృతివనాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. జిల్లాలో 19 మండలాల్లో 95బృహత్ పల్లెప్రకృతివనాల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 69 వనాల నిర్మాణం పూర్తికాగా, మిగతా వాటి పనుల తుది దశకు చేరుకున్నాయి.
-నిఖిల, వికారాబాద్ కలెక్టర్