Agriculture | బొంరాస్పేట, ఏప్రిల్ 11 : ఔషధ గుణాలున్న కీరసాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. అదేవిధంగా మంచి ధర కూడా వస్తుంది. ఒకప్పుడు వేసవిలోనే ఈ పంటను సాగు చేసేవారు. కానీ ఇప్పుడు ఏడాదంతా సాగు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధ్దతిలో ఈ పంటను ఏ నేలల్లోనైనా సాగు చేసుకోవచ్చు. కంపెనీలతో రైతులు ముందుగానే ఒప్పందం చేసుకుని కీర పంటను సాగు చేస్తున్నారు. కొందరు రైతులు సొంతంగా సాగు చేసి మార్కెట్లో విక్రయించుకుని లాభాలు పొందుతున్నా రు. వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట, దోమ, దౌల్తాబాద్ తదితర మండలాల్లో 400 నుంచి 500 ఎకరాలలో కీర పంటను రైతులు సాగు చేస్తున్నారు. సంప్రదాయంగా పండించే పంటలకు బదులుగా నీటి వసతి ఉన్న రైతులు ఎక్కువ లాభాలొచ్చే కీర సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
కీరలకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. దీని కారణంగా వేసవి రాక ముందే రైతులు ఈ పంటను సాగు చేసేవారు. కానీ శుభకార్యాల్లో కీరలను ఎక్కువగా వినియోగిస్తుండటం, ఆరోగ్య రీత్యా ప్రజలు కూ డా కీరలను ఎక్కువగా తీసుకుంటుండటంతో ఏడాది పొడవునా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కొన్ని కంపెనీలతో రైతులు ముందుగానే ఒప్పందం చేసుకునిసాగు చేస్తున్నారు. ఈఒప్పందంలో భాగంగా కంపెనీల వారు రైతులకు విత్తనాలు, మందులు సరఫరా చేస్తారు. వీటికయ్యే ఖర్చులను రైతులకు చివరి లో చెల్లింపులు చేసే సమయంలో మినహాయించుకుంటారు. సాగులో మెళకువలను కూడా అందిస్తారు. రైతుల వద్దకే వచ్చి కీరలను తూకం వేసి హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాలకు డీసీఎంలలో తీసుకెళ్తారు. ఒప్పందంలో భాగంగా కీర సైజును బట్టి కిలోకు ఎంత చెల్లిస్తామనేది రైతుకు ముందుగానే చెబుతారు. 14 మి.మీ సైజు(1వ నంబర్) కీరకు కిలో రూ.36లు, 18 మి.మీ సైజు (2వ నంబర్) కీరకు కిలో రూ.22లు, 25 మి.మీ సైజు (3వ నంబర్)కీరకు కిలో రూ.12లు, 33 మి.మీ సైజు(4వ నంబర్) కీరకు కిలో రూ. నాలుగు చొప్పున రైతుకు చెల్లిస్తారు. రైతులు పొలాల్లో తెంపిన కీరలను గ్రామంలోని ఒక పాయింట్ వద్దకు తీసుకొచ్చి అక్కడ పైన తెలిపిన సైజులు రావడానికి జల్లెడ పడుతారు. అలా సైజును బట్టి కీరలను 20 కిలోల చొప్పున ట్రేలలో వేస్తారు.
విత్తిన 25 రోజుల్లోనే కీర కాయలు చేతికొస్తాయి. నెల రోజుల వరకు రోజు విడిచి రోజు కీరలను తెంచవచ్చు. ఎకరా పొలంలో 12 వందల వరకు విత్తనాలను నాటుతారు. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక ఎకరాలో కీర సాగుకు రైతుకు రూ.20 నుంచి రూ. 25 వేల వరకు పెట్టుబడి అయితే రెండు నెలల్లో ఖర్చులుపోను రూ.80 వేల వరకు ఆదాయం వస్తుం ది. రెండు నెలల తర్వాత మళ్లీ కంపెనీతో ఒప్పందం చేసుకుని మళ్లీ సాగు చేసుకోవచ్చు. ఇలా ఒక ఏడాదిలో ఐదుసార్లు కీర పంటను సాగు చేసే అవకాశం ఉంటుంది. కంపెనీలతో ఒప్పందం కా కుండా కొందరు రైతులు సొంతంగా ఈ పంటను సాగు చేసి మార్కెట్ల లో అమ్ముకుని లాభాలు పొం దుతున్నారు. మార్కెట్లో కి లో కీరలకు రూ.50 నుంచి రూ.60ల వరకు ధర పలుకుతుంది.
కీరలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, పోటాషియం, మెగ్నీషియం, జింక్ , ఐర న్, క్యాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. దాహార్తిని తీర్చేందుకు.. ఊబకాయాన్ని తగ్గించేందుకు.. జీర్ణశక్తిని పెంచేందుకు.. కంటిచూపును మెరుగుపర్చేందు కు, రక్త ప్రసరణ బాగా జరిగేందుకు.. రక్తపోటు, మలబద్ధకాన్ని నివారించేందుకు కీర ఎంతో మేలు చేస్తుంది.
గత ఐదేండ్లుగా కీర పం టను సాగు చేస్తున్నా. ఈ ఏడాది కంపెనీతో ఒప్పం దం చేసుకుని రెండు ఎకరాలలో సాగు చేశా. ఎకరానికి 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చవుతుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తుం ది. తక్కువ రోజుల్లోనే పంట చేతికొచ్చి ఎక్కువ లాభా లు వస్తాయి. దీంతో రైతులు ఈ పంట సాగుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
-లక్ష్మీనారాయణ, రైతు దుప్చెర్ల, బొంరాస్పేట మండలం
వరిని సాగు చేసి ప్రతిరోజూ నీళ్లు పెట్టడం, వాతావరణం అనుకూలించక పంట పండక నష్టపోవడం కంటే కీర పంటను సాగు చేయ డం ఎంతో మేలు. ఎకరం పొలంలో నేను కొన్నేండ్లుగా కీరను సాగు చేస్తున్నా. తక్కువ రోజుల్లోనే మంచి దిగుబడి, లాభం వస్తున్నది. కంపెనీ తో ఒప్పందం చేసుకోవడంతో మార్కెటింగ్ ఇబ్బందిలేదు. అన్ని ఖర్చులు పోనూ రూ.70 నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తున్నది. వరితో పోల్చితే శ్రమ తక్కువ ..ఫలితం ఎక్కువగా ఉంటుంది.
-దేవనూరు అంజిలయ్య, రైతు,దుప్చెర్ల , బొంరాస్పేట మండలం