పరకాల/ఆత్మకూరు/దామెర/శాయంపేట/ సుబే దారి, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా పరకాల, నడికూడ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీజేపీ నాయకులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ముం దస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు రజిత, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు సమ్మకను తెల్లవారుజామున వారి ఇళ్లలోకి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా విజయవాడ-నాగపూర్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న దామెర మండలంలోని ఊరుగొండకు చెంది న బొల్లు సమ్మిరెడ్డి, పులుకుర్తి కి చెందిన పెంచాల సూర్యంను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా తమను అరెస్ట్ చేయడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు బైరపాక ప్రశాంత్, కొమ్ముల శివ, తెలంగాణ ఉద్యమకారులు ఇర్సడ్ల సదానందం, ఎండీ బాబుమియా, నీరుకుళ్ల బీఆర్ఎస్ సర్పంచ్ తడుక నీరజ, ఉప్పుగళ్ల శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్, కొమ్ముల శివ, పరకాల, నడికూడకు చెందిన నాయకులు ఉన్నారు.