ఒకప్పుడు చెలిమెలు, చేద బావులు.. ఆగిఆగిపోసే వ్యవసాయ బోరుబావుల పంపుల వద్ద తెచ్చుకునే ఉప్పు నీటితో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. బోర్లలో వచ్చే ఫ్లోరైడ్తో గొంతు తడుపుకొనే దైన్యస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నీటి కష్టాలు దూరమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’తో తాగునీటి కష్టాలు శాశ్వతంగా కనుమరుగయ్యాయి. ఎక్కడో గుట్టలపై ఉన్న మారుమూల తండాలకు సైతం పైపు లైన్లు వేసి, ట్యాంకులను నిర్మించి భగీరథ నీటిని నిరంతరాయంగా సరఫరా చేస్తుండడంతో గిరిజన ఆడ బిడ్డలు తెలంగాణ ప్రభుత్వ పాలనకు నీరాజనాలు పడుతున్నారు. జిల్లాలోని 348 తండాల్లో 24,391 నల్లా కనెక్షన్ల ద్వారా గడపగడపకూ శుద్ధ జలాలు అందుతున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ సర్కార్ కోట్ల రూపాయల ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి పల్లెకూ తాగునీటిని సరఫరా చేస్తున్నది. ఏడాది పొడవునా తాగునీరు పుష్కలంగా అవుతుండడం ప్రభుత్వ పట్టుదలకు ఇదే నిదర్శనమంటూ గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): మారుమూల ఉన్న గిరిజన ప్రాంతాలవి. ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉన్న ఆ ఆవాసాలకు నీరందించడమంటే సాహసం తో కూడుకున్న పని. ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. అలాగనీ.. తెలంగాణ ప్రభుత్వం ఆ గిరిజనుల తాగునీటి కష్టాలను గాలికి వదిలేయలేదు. నిధుల కేటాయింపునకూ వెనుకడుగు వేయలేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ పథకంలో శుద్ధ జలాన్ని అందించింది. జిల్లాలో 348 తం డాల్లో 24,391 నల్లా కనెక్షన్ల ద్వారా గడపగడపకూ శుద్ధ జలాలు నిరంతరాయంగా అందుతున్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్టుల నుంచి పరుగులు తీసిన కృష్ణమ్మ వా గులు, వంకలు దాటుకుని తండాలను చేరి గిరిజనం దాహార్తిని తీర్చుతున్నది. ఏండ్లనాటి నీటి తండ్లాటను తీర్చిన తెలంగాణ ప్రభుత్వ పట్టుదలకు గిరిజనులు ఫిదా అవుతున్నారు. సీఎం కేసీఆర్ను వేన్నోళ్లా పొగుడుతున్నారు.’
ఎంతో సాహసానికి పూనుకున్న ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానీటిని రంగారెడ్డి జిల్లాలోని పల్లెలు, పట్టణాలతోపాటు తండాలకు సరఫరా చేస్తున్నది. శ్రీశైలం బ్యాక్వాటర్ నీటిని ఎల్లోర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని ముచ్చెర్ల, అంతారం, కమ్మదనం, కల్వకుర్తి వాటర్ ప్లాంట్లకు తరలిస్తున్నది. ఇక్కడ నీటిని శుద్ధి చేసి జిల్లాలోని 1,072 ఆవాసాలకు అందిస్తున్నది. ఇందుకుగాను ప్రభుత్వం 850 ట్యాంకులను నిర్మించి 3,236 కిలోమీటర్ల మేర పైపులైన్ను ఏర్పాటు చేసింది. ఎత్తైన గుట్టలపై మారుమూల ఉన్న తండాలకు సైతం ప్రభుత్వం సాహసం చేసి పైపులైన్ల నిర్మా ణం, ట్యాంకులను నిర్మించి శుద్ధ జలాలను అందిస్తున్నది. రూ.476.35కోట్ల అంచనా విలువతో పనులను చేపట్టి తాగునీటిని అందిస్తున్నది. ఇం దులో తండాల కోసమే ప్రభుత్వం సుమారు రూ. వంద కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది.
జిల్లా వ్యా ప్తంగా 348 గ్రామ పంచాయతీలుండగా.. 24,391 నల్లా కనెక్షన్లతో గడపగడపకూ శుద్ధ జలాలను అందిస్తున్నది. సమృద్ధ్దిగా సరఫరా అవుతున్న కృష్ణా జలాలు ఎండాకాలం, వానాకాలం అన్న తేడా లేకుండా అన్ని రోజుల్లోనూ తండా గిరిజనుల దాహార్తిని తీరుస్తున్నాయి.
ఒకప్పుడు తండాల్లోని గిరిజనులకు చెలిమ నీళ్లే ఆధారం. కాలక్రమంలో చేద బావి.. ఆగిఆగిపోసిన ఉప్పునీటి బోరే ఆ గిరిజనుల దాహార్తిని తీర్చాయి. బోర్లలో వచ్చే ఆ కొద్దిపాటి నీళ్లు సైతం ఫ్లోరైడ్తో కూడుకున్నవే. విధిలేని పరిస్థితుల్లో ఫ్లోరైడ్తో కూడిన ఆ గరళంతోనే గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితిని గిరిజనం ఎదుర్కొన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథ కం తండా గిరిజనుల నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసింది. దాదాపు అన్ని తండాలు ఫ్లోరైడ్ నీటి సమస్య నుంచి బయటపడ్డాయి. గడిచిన ఐదారేండ్లలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా తండాల్లో నమోదు కాలేదు. ఎక్కడో మారుమూల ఉన్న తండాలకూ నిత్యం భగీరథ నీళ్లు నిరాటంకంగా సరఫరా అవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ముం దుచూపుతో తండా ల్లో నీళ్లగోస తీరింది. గతంలో నీటికోసం తీవ్రంగా ఇబ్బందుల కు గురయ్యాం. నీళ్ల కోసం బోర్లు, బావు లు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎండాకాలం వచ్చిందటే కిలోమీటర్ వెళ్లినా దొరికేవికావు. కానీ కేసీఆర్ సీఎం అయి న తర్వాత ఇంటి ముందుకే నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథతో మా తండాలో ప్రతిరోజూ నీరు వస్తున్నది.
గతంలో మా తండాలో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. బిందెడు నీటికోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు మోటర్ల దగ్గరికి నడిచి వెళ్లేది. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత మాకు మంచి రోజులొచ్చాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నది.
-పాత్లావత్ దేవూలీ, వాసుదేవ్పూర్ తండా, కడ్తాల్
మిషన్ భగీరథ ద్వారా మా గ్రామంలో తాగునీరు పుష్కలంగా వస్తున్నది. ఇంటింటికీ నల్లా కలెక్షన్ ఇచ్చి మంచినీటి కరువును సీఎం కేసీఆర్ దూరం చేశారు. గతంలో పడిన బాధలు గుర్తు చేసుకుంటే భయమెస్తున్నది. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం .
-యాదయ్య, మాడ్గుల చాకలిగుట్ట ‘గోస’ తీరింది..
షాద్నగర్ నియోజకవర్గం, నందిగామ మండలంలోని చాకలిగుట్ట తండాలోనూ ఒకప్పు డు నీటి కష్టాలను కోకొల్లలు. ఆవాసంగా ఉన్న ఈ తండా స్వరాష్ట్రంలో పంచాయతీగా రూపాంతరం చెందింది. దీని పరిధిలో తాటిగడ్డ, ధన్సింగ్ తండాలుంటాయి. వీటి మొత్తం జనాభా 1200. గుక్కెడు నీళ్ల కోసం చాకలిగుట్ట తండా వాసులు గతంలో అల్లాడారు. బిందెలు చేతబట్టుకుని 2కి.మీలు కాలినడకన వ్యవసాయ బావులు, బోర్ల వద్దకు గిరిజన మహిళలు పరుగులు తీసేవారు. మిషన్ భగీరథ వచ్చాక నట్టింట్లోనే తాగు నీటి సౌలత్ ఏర్పడింది. మూడు తండాలకు కలిపి ఐదు ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. సుమారు 500 గడపలకు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. కలుషిత నీటితో గొంతు తడుపుకొన్న ఇక్కడి గిరిజనానికి నిరంతరంగా స్వచ్ఛనీరు అందుతుండడంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుముఖం పట్టాయని ఇక్కడి గిరిజనులు చెబుతున్నారు. మిషన్ భగీరథ మా బాధలు తీర్చిందని స్థానిక గిరిజనం సంతోషం వ్యక్తం చేస్తున్నది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మా తాగునీటి కష్టాలను తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఎండాకాలంలో నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం బిందెలతో నడిచి వెళ్లా ల్సి వచ్చేది. మిషన్ భగీరథ పుణ్యమని ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తా గునీరు అందుతున్నది.
-కట్ట చిన్న ఎల్లయ్య, గ్రామం నల్లచెరువు, మాడ్గుల మండలం
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో మా తండాలో నీటి సమ స్య తీవ్రంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న బావుల వద్దకు వెళ్లా ల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ పుణ్యమా అంటూ మా తండాలో ఇంటింటికీ నల్లాల ద్వారా పుష్కలంగా నీరు వస్తున్నది. మిషన్ భగీరథ నీరు తాగడంతో మాకు అనారోగ్య సమస్యలూ లేవు.
నేనావత్ దేశ్యా, సాకిబండ తండా, ఆమనగల్లు
సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చాలా సంతోషంగా ఉన్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. కానీ.. ప్రస్తుతం సీఎం కృషితో స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు ప్రతి ఇంటికీ సరిపడా వస్తున్నది. నీటి కష్టాలు తీర్చిన సీఎంకు ఎప్పుడూ రుణపడి ఉంటా.
– రాణ్య,కొర్రవాని తండా, మంచాల