చేవెళ్లటౌన్, ఫిబ్రవరి 23 : ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనున్న దృష్ట్యా భారీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభను మండల కేంద్రంలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు.
కాగా శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, కలెక్టర్ శశాంక, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జితోపాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బహిరంగా సభ స్థలాన్ని పరిశీలించారు. అక్కడే హెలికాప్టర్ దిగ్గేందుకు అనువైన స్థలాన్ని కూడా పరిశీలించారు. అనంతరం బహిరంగా సభ ఏర్పాట్లపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. సభ ఏర్పాట్లు తొందరగా పూర్తి కావాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు వేంకటేశ్వరరావు, శ్రీలత, సాయిరాం, కృష్ణయ్య, హిమబిందు, రాజేశ్, కిషన్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.