నవాబ్పేట, మార్చి 13 : మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అ ధికారులు, పాలకవర్గ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ ఆవరణలో ఎంపీని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే ఎంతో పేరుగాంచిన అమ్మవారి ఆలయా న్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నా రు. త్వరలోనే అటవీ అధికారుల అనుమతి తీసుకొని ఇక్కడ భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అ నంతయ్య, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, ఆ లయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, ఈవో మదనేశ్వర్రె డ్డి, మాజీ చైర్మన్ గోపాల్, నాయకులు మధుసూదన్రెడ్డి, కృష్ణగౌడ్, మాధవులు తదితరులున్నారు.