యాచారం, నవంబర్25: మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో మైనింగ్ జోన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సిద్ధం చేసిన వేదిక టెంట్ను నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం కూల్చివేశారు. రైతులతో కలిసి కొద్ది సేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఏర్పాటు చేస్తున్న మైనింగ్ జోన్తో ప్రజలు, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లోద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మైనింగ్ జోన్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
మండల కేంద్రంలోని 146సర్వే నెంబర్లో 10.117హెక్టార్లలో మెస్సేర్స్ వైట్రాక్ మెన్స్ అండ్ మినరల్స్ సంస్థ రఫ్ స్టోన్, రోడ్ మెటల్, కలర్ గ్రానైట్ క్వారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం శనివారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుందని వెంటనే ఆపాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగానే వేదిక టెంట్ను కూల్చివేసినట్లు తెలిపారు. మైనింగ్ జోన్తో పర్యావరణానికి, పంట పొలాలకు, వణ్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రజలకు నష్టం వాటిల్లే మైనింగ్ జోన్ మండలంలో ఏర్పాటు చేయొద్దన్నారు. ఇప్పటికే అనుమతులిచ్చిన స్టోన్ క్రషర్లు, క్వారీల అనుమతులను వెంటనే రద్దు చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష, నాయకులు యాదయ్యగౌడ్, శివ, మహ్మద్ ఖాజు, సంపత్, సుధాకర్, కిషన్ పాల్గొన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో డిసెంబర్1 లోపు గ్రామ శాఖ సమావేశాలను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో 50మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా కమిటీకి పంపనున్నట్లు ఆయన తెలిపారు. మండలాన్ని 3లేదా 4జోన్లుగా విభజించి ఎమ్మెల్యే కిషన్రెడ్డి సూచన మేరకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాష నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.