పరిగి, జూలై 20: పల్లె ప్రకృతివనాలతో గ్రామాలకు కొత్త అందాలు చేకూరాయని పరిగి మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్ పేర్కొన్నారు. మంగళవా రం పరిగి మండలం నస్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాఖపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వ నంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేసి మొక్కల పెంపకం చేపట్టడం ద్వారా పచ్చటి అందాలతోపాటు స్వచ్ఛమైన గాలి గ్రామ స్తులకు అందుతుందని అన్నారు. పల్లె ప్రకృతివనాలలో పెంచిన మొక్కలు రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మరింత పెరిగి ఆయా ప్రాంతాలలో పచ్చదనం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎం పీటీసీ బి. సంపూర్ణ వెంకటేశ్, ఉపసర్పంచ్ ఎం.నాగేష్, కార్యదర్శి ఎస్.రమేశ్, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్ గిరిధర్ రెడ్డి, నాయకులు పి.మాణిక్యం, టీ.మల్లేశ్, ఎం.డి.గౌస్ తదితరులు పాల్గొన్నారు.