మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యేను సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సన్మానించిన వారిలో టీఆర్ఎస్ నాయకులు బి.పుల్లారెడ్డి, దండేటికార్ రవి, జంబుల కిషన్రెడ్డి, మొగిలి వెంకటేష్, జగన్రెడ్డి, బహదూర్, జానీపాషా, చింతకింది వీరేశం, బి.నాగరాజుగౌడ్, బాల్రాజ్, జి.విజయ్, నల్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
శాలువాతో సత్కరించి..
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని టీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు గురువారం నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకొని శాలువా, పూలమాలలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో టీఆర్ఎస్పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు పనిచేస్తానని తెలిపారు.
కొత్త కిషన్గౌడ్ ఆధ్వర్యంలో..
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని టీఆర్ఎస్ అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. సన్మానించిన వారిలో మండల మాజీ అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్, బాటసింగారం మాజీ సర్పంచ్ నోముల జగదీష్, బండరావిరాల ఎంపీటీసీ దంతూరి అనితమహేందర్గౌడ్, నాయకులు మహేందర్గౌడ్, మొలుగు దానేష్ ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన యాచారం మండల టీఆర్ఎస్ నాయకులు
యాచారం,జనవరి27: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ ఆధ్వర్యంలో గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.