అబ్దుల్లాపూర్మెట్, మే 23: బాటసింగారం వద్ద 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను రాచ కొండ సీపీ మహేశ్భగవత్ ఆదివారం సందర్శించి వా హనాలను తనిఖీ చేశారు. చెక్పోస్ట్లో విధులు నిర్వ హిస్తున్న పోలీసులకు లాక్డౌన్పై పలు సూచనలు ఇచ్చా రు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్డౌన్ మరింత కఠినతరం చేయాలన్నారు. నిబంధ నలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రజలు అనవ రంగా రోడ్లపైకి రావద్దన్నారు. అత్యవర సర్వీసులు, ఈ-పాస్లు పొందిన వారికే అనుమతిస్తున్నామని తెలిపా రు. నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేసి వాహనాలను జప్తు చేస్తున్నామని వివరించారు.
వాహనాలు సీజ్చేసిన పోలీసులు
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నం రూరల్, మే 23 : నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా, బొంగ్లూరు, ఆదిబట్ల, మంచాల, యాచారం, ఆరుట్ల, దండుమైలారం, రాయపోల్తో పాటు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరం గా తనిఖీ చేస్తున్నారు. ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆం క్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. 10 గంటల తరు వాత రోడ్లపైకి వచ్చే వాహనదారులకు జరిమానా విధిం చడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.
మొయినాబాద్, మే23: పదిగంటల తరువాత కూడా కిరాణ దుకాణం తెరిచిన వారితో పాటు రెండు టిఫిన్ సెంటర్లను నడిపిన వారిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా 10 గంటల తరువాత కూడా అనవసరంగా రోడ్ల మీద వాహనాలతో తిరుగుతున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. 8 వాహనాలు సీజ్ చేయడంతో పాటు 40 వాహనాలకు చలనా విధించారు.
యాచారం, మే 23: గున్గల్ నుంచి మాల్ వరకు సాగర్ రహదారిపై రాకపోకలు కొనసాగించిన వాహనాలను చెక్పోస్టు వద్ద తనిఖీ చేశారు. అత్యవసర వాహనాలు మినహాయిస్తే ఆటోలు, క్రూజర్లు, కార్లు, బైకులను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
ఆమనగల్లు,మే23: లాక్డౌన్ నిబందనలు అతిక్రమించి వాహనాలను రోడ్ల పై వస్తే సీజ్చేసి కేసులు నమోదు చేస్తామని సీఐ ఉపేందర్ హెచ్చరించారు. ఆదివారం ఆమనగల్లు ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో పలు ప్రధాన రహదారుల వద్ద వాహనాలను ఎస్సైలు, సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు.
తలకొండపల్లి మే23: ఉదయం పదిగంటల తర్వాత అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధి స్తామని ఎస్ఐ శివశంకర్వరప్రసాద్ తెలిపారు. తల కొం డపల్లి మండలంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లం ఘిం చిన 25 వాహనాలను సీజ్చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.
షాద్నగర్లో..
షాద్నగర్టౌన్ మే 23: లాక్డౌన్ నిబంధనలను అతిక్ర మిస్తే చర్యలు తప్పవని షాద్నగర్ పట్టణ సీఐ నవీన్ కుమార్ అన్నారు. పట్టణ ముఖ్యకూడలిలోని పోలీస్ చెక్పోస్ట్ వద్ద ఆదివారం వాహనాలను విస్తృతంగా తని ఖీలు నిర్వహించి జరిమానా విధించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయానికి అన్ని పనులు ముగించుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయానికి ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దని, ఎలాం టి కారణం లేకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహ నాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.