కులకచర్ల, ఫిబ్రవరి 15 : ఉపాధిహామీ పనుల్లో పురోగతిని సాధించాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. మంగళవారం కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో దోమ, కులకచర్ల మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చూడాలని అన్నారు. పనులను నిర్ణయించిన తేదీలలోపు పూర్తి చేయాలని సూచించారు. వచ్చే వర్షాకాలనికి హరితహారం కింద మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని అన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పనులకు సంబంధించి సిబ్బంది వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీడీ సరళ, కులకచర్ల ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో సుందర్, ఏపీవో వెంకటేశ్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 15 : తాండూరులో సీసీగా పని చేస్తున్న లక్ష్మయ్య కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లాకు చెందిన సెర్ప్ ఉద్యోగులు రూ.50వేల విరాళాన్ని మంగళవారం వికారాబాద్ డీఆర్డీవో కృష్ణన్ తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. వీరితో పాటు సెర్ప్ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మయ్య, ఎం.ప్రభు, రాంచందర్, సత్యయ్య, నర్సింహులు, బందయ్య, శంకర్ ఉన్నారు.