అందోల్ /గుమ్మడిదల/జిన్నారం, మే 21: వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సోలక్పల్లిలో పీఏసీఎస్ రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న జీలుగ విత్తనాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. 60 శాతం సబ్సిడీపై 90 క్వింటాళ్ల విత్తనాలు మండలంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం నేడు లాభసాటిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్లు శ్రీకాంత్రెడ్డి, ఆంజనేయులు, నాయకులు ప్రభాకర్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. శుక్రవారం మండలంలోని కానుకుంట, కొత్తపల్లి గ్రామాల్లో ఐకేపీల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యారావు, డీపీఏం శ్రీనివాస్ తనిఖీలు చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఐకేపీ నిర్వాహకులకు తెలిపారు. వారి వెంట ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, ఐకేపీ ఏపీఎం శివకుమార్, ఏంఏవో జావిద్, ఏఈవో అస్మిత, సీసీ కృష్ణ, లక్ష్మణ్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో దండిగా ధాన్యం
రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభు త్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పీఏసీఎస్ కేంద్రం ద్వారా రైతులు పండించిన ధాన్యాని కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మండల కేంద్రంలో రైతులకు జీలుగ విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సీనియర్ నాయకుడు గోవర్ధన్రెడ్డి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ పూర్వ అధ్యక్షుడు గటాటి భద్రప్ప, వ్యవసాయాధికారి జావిద్, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. శుక్రవారం అందోల్ క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల అధికారులు, రైస్మిల్లర్లతో సమీ క్ష నిర్వహించారు. అందోల్, వట్పల్లి, ఉమ్మడి పుల్కల్ మండల్లాలో 43 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. సమావేశంలో ఆర్డీవో నగేశ్, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్గుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైస్మిల్లర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.