పెద్దపల్లి : మంథని పట్టణంలోని లక్ష్మీ నారాయణ స్వామిని గురువారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం లక్ష్మీ నారాయణ స్వామి పాలకవర్గం సోమయాజులు దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అశోక్ డైరెక్టర్లు డిగంబర్, సామ్రాట్, రాణి, అర్చకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.