రఘునాథపాలెం, జూన్ 20: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ఇటీవల మండలాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పాలకవర్గ సభ్యులు గ్రామంలో చేపట్టే కార్యక్రమాలపై తీర్మానం చేసుకున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించారు. నిత్యం పారిశుధ్య కార్మికుల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డ్రైనేజీల్లో మురుగు తొలగింపు పనులు చేపడుతున్నారు.