రంగారెడ్డి : ఇంటి స్థల వివాదంలో తోడబుట్టిన అన్ననే హతమార్చిన ఘటన జిల్లాలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ విజయ్ భాస్కర్ రెడ్డి కథనం మేరకు..కౌకుంట్ల గ్రామానికి చెందిన అశోక్ అతడి తమ్ముడు రాజు మధ్య కొంత కాలంగా ఇంటి తగాదా నడుస్తున్నది. కాగా, సోమవారం మాటా మాటా పెరిగి అందరూ చూస్తుండగానే అశోక్ను తమ్ముడు రాజు బండారాయితో మోదీ హతమార్చాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటుకున్న అంబులెన్స్ డ్రైవర్
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం