పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం నంది రిజర్వాయర్లోని నీరు తమ ఇండ్లకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చామనపల్లి గ్రామస్తులు మంత్రి కొప్పుల ఈశ్వర్కు విన్నవించారు. దీంతో స్పందించిన మంత్రి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి గ్రామస్తులకు హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.