డా. బీఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు. అజ్ఞానమనే అంధకారంలో బీడువారిన మెదళ్లలో విజ్ఞానమనే నీటి ధారలుగా నిరంతరం పారే ఒక సెలయేరు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి విముక్తి కోసం పోరాడుతున్న మట్టి బిడ్డలను ముందుకు నడుపుతున్న ఒక మహోన్నత శక్తి. అంబేద్కర్ సామాన్యుడు కాదు. రాజ్యాంగమనే హలం పట్టి అక్షర సేద్యం చేసి అసమానతలకు నెలవైన నేలన సమానత్వపు సిరులు పండించిన అసామాన్యుడు. నిన్న, నేడు, రేపు ఆయన ఆలోచనలు, ఆశయాలు, మేధస్సు, జ్ఞానం, దార్శనికత దేశం దశ దిశలను నిర్దేశించే సూత్రాలు.
అంబేద్కర్ కేవలం ఎస్సీల కోస మే పోరాటం చేశాడు, వారి కోసమే రాజ్యాంగం రాశాడు అనే ఒక తప్పు డు భావన మెజారిటీ సమాజం మెదళ్లలో నాటుకొని పోయింది. కానీ వాస్తవానికి అంబేద్కర్ ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితుడు కాదు. సకల జనుల సౌఖ్యం కోసం, సర్వమానవ సమానత్వం కోసం, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం పోరాడిన గొప్ప పోరాట యోధుడు. ఆయన నవ భారత నిర్మాత. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన ఆర్బీఐ ఏర్పాటు ఆయన ఆలోచనల్లోంచే పుట్టుకొచ్చింది.
‘ది ప్రాబ్లం ఆఫ్ ది రుపీ – ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథంలో తను సూచించిన సూచనల మేరకే ఆర్బీఐ ఏర్పాటు జరిగిందనేది జగమెరిగిన సత్యం. నేటికీ బహుళార్థసాధక ప్రాజెక్టులుగా వెలుగొందుతున్న ‘దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్’, ‘బాక్రానంగల్ డ్యామ్’, ‘సోన్ నది వ్యాలీ ప్రాజెక్ట్’, అతి పొడవైన ‘హిరాకుడ్ డ్యామ్’ నిర్మాణంలో ఆయన పాత్రఅనిర్వచనీయం.
ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అం టూ మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం, అవకాశాల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన త్యాగశీ లి అంబేద్కర్. బ్రిటీష్ వలస పాలనలో కార్మికులు 12-14 గంటలు పని చేసేవారు. కానీ అంబేద్కర్ 1942-1946 మధ్య కాలంలో కార్మిక మంత్రిగా, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా ఉన్నపుడు కార్మికుల పని సమయాన్ని 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించారు.
వేల ఏండ్లుగా మనుస్మృతి పాలనలో మగ్గుతూ అసమానతలు, అణచివేతలు, అమానవీయ ఘటనలతో నలిగిపోతూ కాలరాయబడ్డ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం రూపంలో పునరుద్ధరించి భారతావని బంగారు భవితకు బాటలు వేసిన ఆధునిక భారత పితామహుడు అంబేద్కర్. ఆయన అహోరాత్రులు శ్రమించి, నిద్రాహారాలు మాని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా లక్షల అక్షరాలను పేర్చి రాజ్యాంగాన్ని రూపొందించారు.
భారత సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాసంగికత నాడు, నేడు, రేపు కూడా ఉంటుందనేది నగ్న సత్యం. నేటి భారతంలో సమస్య ఏదైనా పరిష్కారం చూ పించే ఎన్సైక్లోపీడియాగా ఎదిగాడు అంబేద్కర్. దానికి ఉత్తమ ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆనాడే ఆయన దూరదృష్టితో రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 కనుక లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కష్టసాధ్యమయ్యేది.
అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిం చి రాజకీయ పోరాటం చేసిన అనితర సాధ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. మూడున్నర కోట్ల ప్రజల దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేశారు. ఆర్టికల్ 3తో రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన అంబేద్కర్కు ఘనంగా కృతజ్ఞతలు తెలుపాలనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి నూతనంగా నిర్మించిన తెలంగాణ పరిపాలనా సౌధం సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడం హర్షణీయం. ఇన్నాళ్లు ఎస్సీలు తమ వాడల్లో నిర్మించుకునే కమ్యూనిటీ హాళ్లకు మాత్రమే అంబేద్కర్ భవన్లుగా పేరు పెట్టుకునే వారు. కానీ నేడు దాదాపు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే పరిపాలన సౌధానికి నవభారత నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మకం.అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అని చాటి చెప్పడానికి ఇప్పటి వరకు భారత దేశంలో ఏ ప్రధాని కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చేయని పనిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం అభినందనీయం.
సీఎం కేసీఆర్ కేవలం 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పా టు చేయడం, సచివాలయానికి పేరు పెట్ట డం వరకే పరిమితం అయితే పెద్దగా చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ దళితుల కోసం ప్రత్యేకంగా దళితబంధు పథకం తీసు కొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సంఖ్యను గణనీయంగా పెంచారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో 293 గురుకులాల్లో 1,52,054 మంది విద్యార్థులు ఉం డగా నేడు 920 గురుకులాల్లో 4,77, 450 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అంతే కాకుండా మొట్టమొదటిసారిగా డిగ్రీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం 53 గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. కేసీ ఆర్ పాలన అంబేద్కర్ ఆశయాల వెలుగు లో సాగుతున్నది.
(వ్యాసకర్త : సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
డాక్టర్ మంచాల ,లింగస్వామి
8099222020