అడవి బిడ్డల దశాబ్దాల పోరాటం ఫలించింది. కొండకోనల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ఇకపై అటవీ భూముల మీద హక్కులు దక్కనున్నాయి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వటంతో పాటు వాటికి రైతుబంధు కూడా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేయడంతో గిరిజనుల్లో ఆనందం తాండవిస్తున్నది.
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేసి ఉంటే ప్రస్తుత సమస్య ఉండేదే కాదు.అప్పుడు 10 లక్షల ఎకరాల వరకు రెవెన్యూ,అటవీ శాఖ మధ్యన భూమి వివాదంలో ఉన్నది. కానీ ఆ సమస్యను పరిష్కరించలేదు. నిజానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 30,40 ఏండ్ల నుంచి లేని సమస్యలు అటవీశాఖ వాదనల వల్ల 2014 నుంచి పెరిగాయి.
ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 దాకా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యం లో ఒక సబ్ కమిటీని వేశారు. చాలాచోట్ల జిల్లాలలో పోడు సాగు భూమిని కలుపుకొని కందకా లు తవ్వారు. రాష్ట్రంలోని 12 లక్షల ఎకరాల పోడు భూమికిగాను 4300 గూడేలకు సంబంధించిన 2450 గ్రామాల నుంచి 3,40,000 దరఖాస్తులు వచ్చాయి.
‘అటవీ హక్కుల చట్టం-2006’ ప్రకారం ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుల పత్రాలు ఇవ్వాల్సి ఉన్నది. కానీ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా గెంటివేస్తున్నారు. ఇదే సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఘర్షణలు చోటుచేసుకొన్నాయి.
సిర్పూర్ నియోజకవర్గం సార్సలా గ్రామంలో ఇదే జూన్ 30న పోడు, ఆదివాసీ రైతులకు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది మధ్యన ఘర్షణ జరిగింది. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు చాలామంది ఆదివాసులపై కేసులు బనాయించి జైల్లో పెట్టారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసుల వైపు నిలబడ్డారు. వారికి మద్దతుగా నిల్చున్నందుకు ఆయనపై ఫారెస్ట్ అధికారులు చాలాకాలం పాటు గుర్రుగా ఉన్నారు..
ఫారెస్ట్ అధికారులు నిరుపేద ఆదివాసులను గిరిజనులను చిత్తం వచ్చినట్లు కొట్టడం, దవాఖానల పాలు చేయడం, పసి పిల్లల తల్లులని కూడా చూడకుండా కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరుగుతున్నది. వారి భూమి హక్కు మీద అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉక్కుపాదం వేస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. గిరిజనుల ఆందోళనలను, హక్కుల పోరాటాలను అటవీ అధికారుల మీద దాడులుగా, భూ ఆక్రమణలుగా చిత్రీకరిస్తున్నారు.
సార్సాలలో తీవ్ర నిర్భంధం ప్రవేశపెట్టిన సమయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను స్వయంగా సమస్యలున్న జిల్లాలలో పర్యటించి సమస్యను పరిష్కరిస్తానన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదివాసీల వైపు నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించినందుకు ఆయనను అభినందించారు.
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో ‘కోనేరు రంగారావు భూ కమిటీ’ సిఫారసులను ప్రభుత్వం అమలు చేసి ఉంటే ప్రస్తుత సమస్య ఉండేదే కాదు.అప్పుడు 10 లక్షల ఎకరాల వరకు రెవెన్యూ,అటవీ శాఖ మధ్యన భూమి వివాదం లో ఉన్నది. ఆ సమస్యను పరిష్కరించలేదు. నిజానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 30, 40 ఏండ్ల నుంచి లేని సమస్యలు అటవీశాఖ వా దనల వల్ల 2014 నుంచి పెరిగాయి. అటవీ శాఖ అనుమతులు లేవంటూ అనేక పనులతో పాటు రోడ్డు పనులు కూడా ఆపే పరిస్థితి వచ్చింది. ‘దిందా -చింతల మానేపల్లి’ మధ్యన 70 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి లేదు. ఈ వాగు దాటి వెళుతున్న సందర్భంలో ఒక ఎంబీఏ విద్యా ర్థి వాగులో గల్లంతై మరణించాడు. వాగుపై బ్రిడ్జ్ నిర్మించి ఉంటే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉండకపోవు.
నిజానికి సార్సాలలోని 100 ఎకరాలకు ఆదివాసీలకు పట్టాలు ఉన్నాయి. వారందరికీ పాస్బుక్స్ ఉన్నాయి. రైతుబంధు వస్తున్నది. దీనికి ట్రెంచ్ కొట్టారు. నిజానికి ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూముల్లో మొక్కలు పెంచాలంటే. ఇక్కడ‘డీ’గ్రేడ్ ఏరియా భూములు వేలాది ఎకరాల్లో ఉన్నాయి. కానీ అటవీశాఖ అధికారులు అటు వైపు చూడరు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసిల, గిరిజనుల భూములే వారికి కనిపిస్తాయి. వారే అటవీ శాఖకు టార్గెట్. వారిని పోలీసుల సహాయంతో అడ్డుకుంటారు. భూముల నుంచి తరిమేస్తారు.
నిజానికి ఈ రోజు అటవీ శాఖ అధికారులు ఆదివాసీ, గిరిజనుల మీద పోడు వ్యవసాయం, అటవీ భూముల ఆక్రమణల పేరిట చేస్తున్న దాడులు, కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకొని సీఎం కేసీఆర్ వ్యక్తిగత పరిశీలన అనంతరం సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు!. పోడు భూములకు పట్టాలు ఇచ్చి సర్వ హక్కులను వారికి
కల్పించబోతున్నారు!
ప్రభుత్వమే ఆదివాసీలకు భూ హక్కులు కల్పిస్తున్నందున అటవీ శాఖాధికారులు సంయమ నం పాటించాలి. ప్రభుత్వం వారికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. మొత్తానికి జల్, జమిన్, జంగల్ నినాదంతో పోరు నడిపిన ఆదివాసీ బిడ్డ కు మ్రం భీమ్ పుట్టిన జిల్లా అయిన ఆసిఫాబాద్ జిల్లా నుంచి పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం అభినందనీయం! ఇక మీదట ఆదివాసులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే విధంగా పరిస్థితులను కల్పించాలి. దశాబ్దాల సమస్యను పరిష్కా రం దిశకు తెచ్చిన సీఎం కేసీఆర్కు కృతజతలు. ఆదివాసీల హక్కుల కోసం నిర్విరామ పోరు చేసిన ఎమ్మెల్యే కోనప్పకు శుభాకాంక్షలు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు)
-ఎండీ మునీర్
99518 65223