హరారే: ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు జింబాబ్వేతో తొలి టీ20లో గెలిచి విజయాల బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోష్లో ఆ జట్టును మరోసారి పడగొట్టేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్ గెలుపు జోరును కొనసాగిస్తూ శనివారం జరిగే రెండో టీ20లోనూ నెగ్గి సిరీస్ అందుకోవాలని పట్టుదలగా ఉంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలో ఎదురైన ఓటముల తర్వాత తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం అయ్యర్సేనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ధ శతకం చేసి తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. కానీ, ఓపెనర్ అభిషేక్ శర్మ ని రాశపరచడం ఒక్కటే జట్టును ఇబ్బంది పెట్టే అంశం.
రెండేండ్ల కిందట ఇదే హరారే మైదానంలో తన తొలి టీ20 శతకం అందుకున్న అభి ఈ మ్యాచ్తో తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. గత పోరులో భారత పేస్ బౌలింగ్ను తట్టుకోలేక పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి డీలా పడిన ఆతిథ్య జట్టు ఈసారి ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.