వలసలు చాలా రకాలుంటాయి. బతుకుదెరువు కోసం వెళ్లే వలసలు.. ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వలసలు.. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వెళ్లే వలసలు ఇలా ఎన్నో. మైరుగైన జీవనం కోసం ఉండే వలసలను మనం మేధో వలస అని కూడా అనవచ్చు. ఈ రకం వలసలు భారత్ నుంచి కూడా ఉన్నాయి. మేధో వలసలు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కాగా… ఉపాధి కోసం గల్ఫ్, దుబాయి లాంటి దేశాలకు ఉంటున్నాయి. అంటే ఆయా రంగాల్లో ఆ దేశాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్న మాట. మరి ఒక దేశంలో ఏదైనా రాష్ట్రంలోకి కూడా ఇదే విధంగా వలసలు ఉంటే…కచ్చితంగా ఆ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. అలా ఇప్పుడు దేశంలో వలసవచ్చేవారికి మోస్ట్ ఫేవరేట్ కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అయింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వలసలకు కేంద్రంగా ఉండేది. పాలమూరు కూలీ లు పనులకోసం, కరీంనగర్, నిజామాబాద్ లాం టి ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ , దుబాయ్, ముంబైకు వలస వెళ్లేవారు. కానీ ఈ ప్రాంతం ఇప్పుడు ఫేట్ మార్చుకున్నది. తెలంగాణ వస్తే ఏమొస్తదని సన్నాయి నొక్కులు నొక్కిన వారందరి దిమ్మ తిరిగేలా మైగ్రేషన్కు తెలంగాణ హాట్స్పాట్ అయింది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడకు వస్తే బతుకుపై భరోసా కలుగుతుంది. కార్మికులు మొదలు సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లో తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో వలస వచ్చేవారు పెరిగారు.
ఈ సందర్భంలో ఒక్కసారి తొమ్మిదేండ్ల క్రితం పరిస్థితిని మనం గుర్తుచేసుకోవాలె. ఉమ్మ డి రాష్ట్రంలో పొట్ట చేతబట్టుకొని కూలి పనికోసం రాష్ట్రం కానీ రాష్ట్రం, దేశం కానీ దేశం వలస వెళ్లిన సంఘటనలు అనేకం తెలంగాణలో. కానీ ఇప్పు డు ఎంతోమంది ఇక్కడికి వలసలు వస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో మాత్రమే కాదు. తెలంగాణలోని ఏ మారుమూల పల్లెలోకి వెళ్లిన సరే వలస కార్మికులు కనిపిస్తున్నారు. యూపీ, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా ఏ రాష్ట్రం వారైనా సరే ఇప్పుడు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. నిజానికి వలసలకు సంబంధించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాల్లో నిర్మాణ, మౌలిక రంగాల్లో ఉపాధి లభిస్తే, మరికొన్ని దేశా ల్లో ఐటీ, సర్వీస్ రంగంలో అవకాశాలుంటాయి. కానీ ఒక్క తెలంగాణలో మాత్రమే వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో వలస జీవులకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి.
మరి తెలంగాణ ఫేట్ ఇలా మారటానికి కారణమేంటీ? దశాబ్దాలుగా వెనుకబడిన తెలంగాణ ఈ తొమ్మిదేండ్లలో ఎందుకు అద్భుతాలను సృష్టిస్తోం ది. అంటే కచ్చితంగా అది ఒకే ఒక్క వ్యక్తి సంక ల్పం కారణంగా జరుగుతోంది. ఆ వ్యక్తి పేరే కేసీఆర్. ఆయన నిరంతరం మేధోమథనం చేస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచేందుకు పరితపిస్తున్నారు. ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. ఈ మూడు రంగాలను ఏకకాలంలో పరుగులు పెట్టించటమంటే సాధారణమైన విషయం కాదు. చాలా అభివృద్ధి చెందిన దేశాలు సేవా రంగంపై లేదంటే పారిశ్రామిక రంగంపై ఆధారపడుతాయి. కానీ ఇండియా లాంటి దేశంలో వ్యవసాయ రంగాన్ని విస్మరించి అభివృద్ధి సాధించటం అయ్యేపని కాదు. అదే సమయంలో ప్రపంచంతో పోటీ పడాలంటే పారిశ్రామిక, సేవా రంగాలపైన దృష్టి పెట్టాలి. ఈ విషయాన్ని దేశ ప్రధాని మోదీ అర్థం చేసుకోలేదు. కానీ విజనరీ లీడర్ కేసీఆర్కు ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చేయాల్సిన పనుల విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్న ది. అందుకే ఆయన తెలంగాణ విషయంలో ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ దేశానికి ఒక రోల్ మాడల్గా నిలుపుతున్నారు.
అందుకే తొమ్మిదేండ్లుగా ఇదే యజ్ఞం చేస్తున్నారు కేసీఆర్. ముఖ్యంగా వ్యవసాయ రంగం కోసం ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి రైతులకు సాగునీరు బాధలు లేకుండా చేసే పనిలో పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీరు బాధ లేకుండా చేశారు. తద్వారా భూగర్భ జలమట్టం పెరిగింది. మత్స్య సంపద పెరిగింది. రైతులకు యూరియా బాధ, కరెంట్ కష్టాలు లేకుండా చేశారు. తద్వారా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ నిండి వ్యవసాయానికి మేలు జరుగుతున్నది. పరిశ్రమలు పెరిగేందుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనను సులభతరం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడకు వచ్చే విధంగా శాంతిభద్రతలను అదుపులో ఉంచటం, మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. ఇలా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ చేపట్టిన లిస్ట్ చాంతాడంత ఉన్నది. ఈ యజ్ఞ ఫలితాల కారణంగానే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ ప్రజల సంపద పెరిగింది. ఆ క్రమంలోనే ఎన్నో అవకాశాలు వస్తుండటంతో తెలంగాణలో వలసల జాతర కొనసాగుతోంది.
ఒక ప్రాంతం అభివృద్ధి సూచికల్లో వలసలు (మైగ్రేషన్) అనేది కీలకం. ఏ ప్రాంతంలోనైతే ఎక్కువ వలసలు ఉంటాయో ఆ ప్రాంతం అత్యంత అభివృద్ధి చెందినట్టు భావిస్తామని ఐక్యరాజ్య సమితి చెబుతున్నది. లేబర్ మైగ్రేషన్, మేధో వలసలు, సీజనల్ మైగ్రేషన్స్ ఇలా అన్ని రకాల మైగ్రేషన్స్ ఉన్న ప్రాంతాలు అరుదుగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి అరుదైన ప్రాంతం తెలంగాణ.
ఇక్కడకు ఒక్క లేబర్ మాత్రమే కాదు స్టూడెం ట్స్, మేధావులు, స్కిల్డ్ ఎంప్లాయిస్, సీజనల్ వ్యాపారులు, మెడికల్ టూరిజం, అదే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు వ్యాపారవేత్తలు కూడా వలస వస్తున్నారు. నిజానికి వలసల లెక్కకు సంబంధించి దేశం లో సరైన డేటా లేదు. ఐతే ఇండియాలో ఎక్కువ మంది ముంబైకి వలస వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని కచ్చితంగా తెలంగాణ ఆక్రమించి ఉంటుంది.
ఇటీవలే హైదరాబాద్ డెవలప్మెంట్కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటించిన మెట్రో ప్రాజెక్ట్ పూర్తైతే ఇంకా లక్షలాది ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. హైదరాబాద్ నాలుగువైపులా విస్తరించేందుకు అవకాశం ఉండటం కూడా కలిసి వచ్చే అంశమే. అంటే ఇప్పుడు వస్తున్న వలసలు జస్ట్ ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఉపాధి కావాలంటే దేశం మొత్తం తెలంగాణ వైపే చూసే రోజు దగ్గర్లోనే ఉన్నది. దటీజ్ కేసీఆర్
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్ )