తెలంగాణ రాష్ట్రం దేశంలో మరో ఘనతను సొంతం చేసుకున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో నూటికి నూరు శాతం సురక్షితమైన తాగునీటిని అందించే ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి గా నిలిచింది. అలాగే జల్జీవన్ మిషన్ అమలులో భారతదేశం పురోగతిని సాధించిందని, ఇంటింటికి వందశాతం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ, గోవా, హరియానా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయని పేర్కొన్నది.
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. రాష్ట్ర తాగునీటి స్వచ్ఛత 98.7 శాతంగా ఉండి మిగిలిన రాష్ర్టాల కంటే నీటి స్వచ్ఛతలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. యూ రప్ దేశంలో కేవలం 62 శాతం ఇండ్లకే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని ప్రపం చ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఈ ఘనత మిషన్ భగీరథ, రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి ద్వారానే సాధ్యమైంది. ఇతర దేశాల కంటే కూడా నీటి స్వచ్ఛతలో మన రాష్ట్రం ముందంజలో ఉండ టం హర్షణీయం. దేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికి తాగునీటి వసతి ఉందని తెలిపింది.
మిషన్ భగీరథ కేంద్రం నుంచి ఎటువంటి సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అంతర్గత, బాహ్య వనరులపై ఆధారపడిన ఒక మంచి నీటి పథకం. రాష్ట్ర ప్రభుత్వం భూ గర్భ జలాల వినియోగాన్ని తగ్గించడానికి, ఉపరితల నీటిని వినియోగించుకోవడానికి, గ్రామీణ ప్రాంతా ల ప్రజలకు తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీటిని ప్రవేశపెట్టింది. మిషన్ భగీరథ ద్వారా నేడు, ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు రోజుకు తలసరి 100 లీటర్లు అందుతోంది. ఇది గృహాల వద్ద టబ్లు, బకెట్లు, మినీట్యాంక్లలో నీటి నిల్వ భారాన్ని తగ్గించింది. తద్వారా దోమల వృద్ధి ప్రదేశాలను చాలావరకు దూరం చేసింది.
దీనితో పాటు, ఆరోగ్య, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల నివారణ చర్యలు రాష్ట్రం లో మలేరియా, డెంగ్యూ కేసులను సమిష్టిగా తగ్గేలా కృషి చేస్తున్నాయి. మిషన్ భగీరథ పథకం ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18 శాతం తక్కువ వ్యయంతో పూర్తి చేశారని, దీనిని రూ.44,933.66 కోట్ల అంచ నా వ్యయంతో రూపొందిస్తే, ప్రాజెక్టు పూర్తి అయ్యేనాటికి వాస్తవ వ్యయం రూ.36,900 కోట్లు మాత్రమే అయిందని లెక్కతేలింది. మిషన్ భగీరథను అతి తక్కువ వ్యయంతో, అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని మంత్రి హరీశ్రావు ఇటీవల బడ్జెట్ ప్రసంగం లో వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు వ్యాధులు కూడా ప్రబలడం లేదని తేలింది. ఎందుకంటే సురక్షిత నీరు ప్రతి ఇంటికి లభిస్తుంది, అలా గే కుటుంబంలో మహిళలు లేదా బాలికలు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన అవసరాన్ని కూడా లేకుండా చేసింది.
గ్రామాల్లో నీటిని తీసుకురావడానికి వినియోగించే సమయం బాగా తగ్గిపోయి, మహిళలు ఇతర ఉత్పాదక, ఆర్థిక కార్యకలాపాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఖచ్చితమైన ప్రణాళిక, అత్యంత పారదర్శకత, ఆధునిక పద్ధతులు, విధానాలను అవలంభించి నిర్ణీ త సమయంలో మిషన్ భగీరథ పూర్తి చేయడమే కాకుండా రూ.8,033.66 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మిషన్ భగీరథతో రాష్ట్రంలో జరిగిన మరో అద్భుతం ఫ్లోరైడ్ శాతం పూర్తిగా తగ్గిపోవడం. నేడు, ఈ పథకం స్పూ ర్తితో కేంద్రం జాతీయ స్థాయిలో హర్ ఘర్ జల్ యోజన పేరుతో అమలు చేస్తున్నది.
-డా. కందగట్ల శ్రవణ్ కుమార్
86393 74879