తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (టీపీసీసీ) కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ డీ ఫ్యాక్టో అధ్యక్షునిగా వ్యవహరించడం ఏమిటని రేవంత్రెడ్డి వర్గీయులు భగ్గుమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు మొదలుకొని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలనుకుంటున్న షర్మిల వరకు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ను కలిసివస్తున్నారు. తనను కాదని డీకే శివకుమార్ను కలిసినా ఫలితం ఉండదని రేవంత్రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షునిగా తాను ఉన్నంతకాలం షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం కాదు రాసిపెట్టుకోండని రేవంత్రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అడిగినచోట కాకుండా మరొకచోట టికెట్ వచ్చిందంటే అక్కడ కేపీసీసీ అధ్యక్షుడు ఎంత పవర్ఫుల్లో తాను కూడా ఇక్కడ అంతేనని రేవంత్రెడ్డి పరోక్షంగా సంకేతం ఇచ్చారేమో.