ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడు గౌతమ్ అదానీ దొంగ పనులు, దేశాన్ని ముంచిన వ్యవహారాలు తవ్విన కొద్దీ అత్యంత భయంకరంగా బయట పడుతున్నాయి! ఇప్పుడు ఆయన సోదరుడు వినోద్ అదానీ వియ్యంకుడు జతిన్ మెహతా వ్యవహారం బయటకు వచ్చింది! దేశంలోని బ్యాంక్లను ముంచి రూ. 7,000 కోట్లు దండుకొని దేశం విడిచి పారిపోయారు. అంతేకాదు వేరే దేశంలో జతిన్, ఆయన భార్య పౌరసత్వం కూడా తీసుకుని హాయిగా ఉన్నారు! అదానీ రూ.12 లక్షల కోట్ల స్కాం విషయంలో ప్రధాని మోదీ ఇంకా సమాధానం ఇవ్వలేదు!
అదానీతో మోదీకి ఉన్న అనుబంధం గురించి విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమూ లేదు! మారిషస్ నుంచి షెల్ కంపెనీల ద్వారా ఇక్కడ అదానీ కంపెనీల్లో పెట్టిన రూ. 20,000 కోట్ల పెట్టుబడులు ఎవరివి? అంటే సమాధానం లేదు? జతిన్ మెహతా కు చెందిన దుబాయ్ తదితర దేశాల 13 కంపెనీలు బంగారు ఆభరణాలు తయారు చేసి అమ్మేవి. 2014లో జతిన్ విషయంలో ఫిర్యాదులు వస్తే ,సీబీఐ మూడున్నర ఏండ్ల తర్వాత 2017 ఏప్రిల్లో కేసు నమోదు చేసింది. ఈ లోపు ఆయన భార్యతో సహా విదేశాలకు పారిపోయి అక్కడ పౌరసత్వం కూడా పొందడం విశేషం! అసలు జతిన్ దంపతులకు ఎన్ఓసీ ఎవరిచ్చారు? ఎవరు ఇప్పించారు? మొంటిరేసా గ్రూప్లో జతిన్ డైరెక్టర్గా కూ డా ఉన్నారు! దీనితో అదానీకి లింక్ ఉన్నది! మెహుల్ భాయ్, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇలా చాలామంది మనదేశాన్ని ముంచి విదేశాలకు పారిపోయా రు.
ఒక్కొక్కరికి సంబంధించిన అవినీతి,అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం దున్న పోతు మీద వర్షం పడుతున్న చందం గా మౌనం వహిస్తున్నది! తినను, తిననివ్వను అం టూ భారీ మాటలతో, నల్ల ధనం కక్కిస్తామని, అవినీతి, అక్రమాలను సహించేదే లేదంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు ఆ మాటపైగానీ, వ్యక్తుల విషయంలో గానీ, సంస్థ ల మీద కానీ మాట్లాడడం లేదు!
విపక్షాల జట్టును,అవినీతి పరుల జట్టుగా,తాను ఒక్కడే వారితో ఢీ కొంటున్నానని, తన కోసం వారు బొంద తవ్వుతార ట లాంటి విక్టిం కార్డును పక్కన పెట్టుకుని మోదీ పదే పదే మాట్లాడుతూ ఉంటారు! మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండ దు! ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చే హామీ, ధరలు తగ్గించే హామీ, నల్ల ధనం వెలికి తీసి అందరి ఖాతా ల్లో రూ.15 లక్షలు వేసే హామీ తు స్సుమన్నవి! ఈ మాటలు ఇప్పు డు ఎత్తుడే లేదు! అన్నీ ఒట్టి మాటలే! ఎలా ప్రజలను మభ్య పెట్టాలి! విద్వేష ఉపన్యాసాల ద్వా రా అమాయకులను తమవైపు ఎలా తిప్పుకోవాలి! హిందుత్వ రాజకీయాలు చేసి ఓట్లు దండుకుని ఎలా అధికారంలోకి రావాలి! అంతా ఇదే యావ! విపక్షాల్లో ఎవరు గట్టి వారు! వారిపైనా ఈడీ, సీబీఐ, ఐటీ ఎలా ప్రయోగించాలి. వారిని ఎలా దారికి తెచ్చుకోవాలి? అంతా ఇవే ఆలోచనలు. మొత్తం అప్రజాస్వామిక విధానాలు, చర్యలు తప్ప దేశ హితం శూన్యం!
బుద్ది జీవులు కదలాలి! యోచించాలి! రాజ్యాం గం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులు హరించబడుతున్నాయి! బీ అలర్ట్!పాలకులు ఈ దేశ సంపదను లూటీ చేసిన దోపిడీ దారులకు మద్దతుగా ఉన్నారు! కనీసం వారిని ప్రశ్నించే దమ్ము కూడా లేదు!ఈ దేశానికి దమ్మున్న నేతలు కావాలి! ప్రజా క్షేత్రంలో నిరంతరం జనాన్ని, వారి మనోభావాలను అంటిపెట్టుకుని, గౌ రవం ఇచ్చే వారు కావాలి! కులమతాలకు అతీతమైన భారత్లో మతోన్మాదులకు రాజ్యాధికారం ఇవ్వడమే పెద్ద పొరపాటు. నిజం నేల మీద ఉన్నది! దాని వెంట పీడిత,తాడిత ప్రజలు ఉన్నారు! అబద్ధాన్ని ఓడిద్దాం! నిజాన్ని గెలిపిద్దాం!
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు)
– ఎండీ.మునీర్, 99518 65223