Bandi Sanjay | రెండు నెలల కిందట బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంత్రి మాటలను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. మార్చడం ఖాయం అని పార్టీలో గట్టిగా వినిపించింది. దీంతో బండి ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ చుగ్తో ప్రకటన చేయించారు.
ఇక తనను మార్చుతారనే ప్రచారానికి తెరపడుతుందని భావించారు. అయినా బండి మార్పు వంద శాతం ఖాయం అని పార్టీ నేతలు కొందరు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. దీంతో బండి సంజయ్ తాజాగా మళ్లీ ఢిల్లీకి వెళ్లి తనను మార్చేది లేదని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని వాపోయారు. మరేం చేద్దాం… పార్టీ తరఫున అడ్వైర్టెజ్మెంట్ ఇద్దామా అని జాతీయ నాయకుడు ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు పార్టీ కార్యాలయంలో వినికిడి.
– వెల్జాల