– విద్యానగర్ కాలనీ సర్పంచ్ భూక్య శాంతి శ్రీ
చుంచుపల్లి, ఆగస్టు 05 : చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ సర్పంచ్ భూక్య శాంతి శ్రీ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి పాల్గొని వారు మాట్లాడారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే తాగించాలని, తల్లిపాలలో ఉండే కోలొ స్ట్రమ్ బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఇస్తుందని, పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు తాగించాలని, పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్నారు. ఆరు నెలల అనంతరం పోషకాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ వార్డ్ మెంబర్స్ వాడపల్లి జకరయ్య, మాలోత్ శంకర్, నాగమణి, రమాదేవి పూర్ణ, నాగమణి, రజిత, డాక్టర్ పద్మ కుమార్, గ్రామ పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, పంచాయతీ గుమస్తా రామకృష్ణ, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సూపర్వైజర్, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.