రైతుల గుండెల్లో కాంగ్రెస్ కరెంటు మంటలు పెట్టింది. ఆ రైతుల గుండె మంటల్లోనే కాంగ్రెస్ మాడి మసవుతున్నది. నాడు చంద్రబాబు కరెంటుతో గోక్కున్నడు. నేడు చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుకు 24 గంటల కరెంటు వద్దంటున్నడు. దీంతో తెలంగాణ రైతులోకం కదిలింది. కాంగ్రెస్పై యుద్ధం ప్రకటించింది. కరెంటు వద్దనే కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపుదామంటూ తెలంగాణ రైతాంగం తీర్మానం చేస్తున్నది.
మహబూబ్నగర్ పెద్దవ్వ రైతు దేవవ్వ కన్నెర్ర జేసింది. సిరిసిల్ల రాజన్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. యాదాద్రి నర్సన్న మహోగ్రరూపం దాల్చిండు. నిజామాబాద్ రైతు నిప్పుల కొలిమై వస్తున్నడు. కరీంనగర్ కర్షకుడు కన్నెర్ర జేసిండు. సిద్దిపేట రైతుబి డ్డ కాంగ్రెస్ తీరును ఎండగడుతూ కల్లోల కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతున్నడు. ఊరూరా రైతు చర్చలు జరుగుతున్నాయి. రైతులు కాంగ్రెస్ను కడిగిపారేస్తున్నరు. కరెంటు వద్దన్నోన్ని అవే కరెంటు తీగలకు వేలాడదీయాలని మండిపడుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా కరెంటు చర్చనే.
నాడు కరెంటు చార్జీల పెంపుతో తెలంగాణ ఉద్యమ జ్వాల పుట్టింది. ఇప్పుడు కరెంటు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కరెంటు వద్దన్న కాంగ్రెస్ను
బంగాళాఖాతంలో కలిపేద్దామంటూ రైతులు తీర్మానించుకుంటున్నరు. పాలమూరు రైతు దేవవ్వ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈపులు వల్గేటట్టే ఉన్నయి. కరెంట్ వద్దంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కర్షకుల కండ్లలో కరెంట్ మంటలు పెట్టిన కాంగ్రెస్ పార్టీకే ఎసరు తెచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు వెన్నెముకగా నిలిచింది. రైతులు సంతోషంగా ఉన్న రు. 24 గంటల నాణ్యమైన కరెంటు వస్తున్నది. పెద్దఎత్తున పంటలు పండుతున్నాయి. రైతుబంధు సాయం అందుతున్నది. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతున్న రైతుల్లో ఒక్కసారిగా కాంగ్రెస్ పుట్టించిన కరెంటు మంటలు ఆగ్ర హం తెప్పిస్తున్నాయి.
24 గంటల కరెంటు కావాలి. మూడు పం టలు పండాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ మూడు గంటల కరెంటు మాకొద్దు. సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు మాకు ముద్దు. కరెంటు అవసరం లేదన్నోళ్లకు తెలంగాణలో చోటులేదంటూ ఎక్కడికక్కడ రైతన్నలు మీటింగులు పెడుతున్నరు. రైతు వేదికల్లో అం తా కరెంటు గురించే చర్చ నడుస్తున్నది. తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ శని పీడ విరగడయ్యేటట్టు తెలంగాణ నుంచి తరిమికొట్టాలని తీర్మా నం చేస్తున్నరు. కరెంటు వద్దంటే ఈపులు వల్గాలి. రైతు బంధువు కేసీఆర్ మన గుండెల్లో ఉండాలంటూ తెలంగాణవ్యాప్తంగా రైతులు నినదిస్తున్నారు.
రైతు ఉసురుపోసుకున్న వాడెవడు రాజకీయాల్లో బతికి బట్ట కట్టలేదు. కాంగ్రెస్ అసలు రూపం రైతాంగానికి అర్థమైంది. కరెంటు అవసరమే లేదు. ఇస్తే మూడు గంటలు చాలు అం టూ రేవంత్రెడ్డి రైతు వ్యతిరేకి అని తేలిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రైతులు మంచిగా బతక డం ఇష్టం లేదు. కేవలం రాజకీయాలు, అధికార యావ తప్ప రైతు బాధ అర్థం చేసుకోరు. 70 లక్షల రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇక తెలంగాణలో దుకాణం బందయినట్టే.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 24 గంటల ఉచిత కరెంటును కాంగ్రెస్ తప్పుపడుతూ కొత్త నాటకమాడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం మూడెకరాలు గల చిన్న, సన్నకారులు వ్యవసాయదారులున్నారని, అయితే ఒక ఎకరం భూమి పారించడానికి గంట కరెంటు అవసరం పడుతుందని, మూడెకరాలు పారించడానికి మూడు గంటలు సరిపోతుందని చెప్తున్నది.
అంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత కరెంటు విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉచిత కరెంటు విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న భూమిలో 60 శాతం బోర్లు, బావుల కిందనే సాగవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 7 గంటలకు మిం చి కరెంటుని ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. ప్రస్తుతం 24 గంటలు రైతుకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందించడంలో ప్రభుత్వం చూపెడుతున్న చొరవ గొప్పది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి నిరంతర నాణ్యమైన కరెంటు ఇవ్వడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. దానివల్లే వ్యవసాయరంగం, పారిశ్రామికరంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతున్నది. వ్యవసాయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది.
రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, మార్కెట్లు, రైతు కల్లాల వంటి సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నది. దీనివల్లె నేడు దేశంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్నది. అలాంటి విద్యుత్తును కేవలం 3 గం టలు ఇస్తే చాలంటున్న రేవంత్రెడ్డికి తెలంగాణ రైతాంగం కర్రుకాల్చి వాతపె ట్టే రోజు ఎంతో దూరంలో లేద న్న నిజాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి.
-చిటుకుల మైసారెడ్డి
94905 24724