బొగోట, ఆగస్టు 10: దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ధాటికి..పలు చోట్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. పెరిరా నగరంలో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో 47 మందిదాకా ప్రాణా లు కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. అనేక చోట్ల పదుల సంఖ్య లో భవనాలు దెబ్బతినగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి పొరుగుదేశం ఈక్వెడార్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో 107 కిలోమీటర్ల లోతులో భూకంపం రావడంతో చోకో ప్రావిన్స్ రాజధాని క్విబ్డోలో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.