స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నాటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది.ఆనాటి నుంచి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఆయన తపన. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతున్నరు.కానీ ఇటీవల కొందరు బీఆర్ఎస్ నాయకులు చిన్న కారణాలకే అసంతృప్తి రాగాలు తీస్తున్నారు. ఇది వారికి, పార్టీకి శ్రేయస్కరం కాదు.
అసలే అదను కోసం గుంట నక్కల్లా కాచుకొని కుసున్నోనికి అవకాశం ఇచ్చినోల్లం అవుదామా? పెద్ద బాలశిక్ష చదివే పొల్లగాండ్లలాగా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోనేంత దిగజారుదామా? ఎవరు బంగారం, ఎవరు వెండి అనేది కేసీఆర్కి తెలువకుంట ఉంటాదా? మరీ ఇదెక్కడి ఇచ్చంత్రం.. ఎవరు ఏందీ.. ఎసొంటోడు అనేది ఆయనకు తెల్వదా? అందరి జాతకాలూ సారు దగ్గర లేవా ఏంటి? అన్నీ ఉన్నాయి. అసలే ఎలచ్చన్ల కాలం. డేగలు తిరుగుతున్నాయి సుమా.. ద్రోహం చేసే పని పెట్టకండి.
సల్లగా ఏసీలో జారగిలబడి కూసోని తీకునాలు దీత్తండ్లు గాని.. తెలంగాణ జనం నిలదీస్తరు జాగ్రత్త బిడ్డా! ఆడొగలు, ఈడొగలు కూసోని రెచ్చిపోతుండ్రు. ఓర్నీ.. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ అనుకున్నారా? నిజంగానే మల్లన్న గేలిచేస్తే.. గిది కాదు పద్ధతి. ఒకవేళ నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందామని మీరట్లా గీ మీటింగులు పెడితే మీడియాకి వచ్చేది కాకుండే. అసలే అదను కోసం గుంట నక్కల్లా కాచుకొని కుసున్నోనికి, ఎనిమిది ఏండ్లుగా కేంద్రంల రైతుల నడ్డి ఇరిసినోనికి అవకాశం ఇచ్చినోల్లం అవుదామా? పెద్ద బాలశిక్ష చదివే పొల్లగాండ్ల లాగా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోనేంత దిగజారుదామా? ఎవరు బంగారం, ఎవరు వెండి అనేది కేసీఆర్కి తెలువకుంట ఉంటాదా? మరీ ఇదెక్కడి ఇచ్చంత్రం.. ఎవరు ఏందీ.. ఎసొంటోడు అనేది ఆయనకు తెల్వదా? అందరి జాతకాలూ సారు దగ్గర లేవా ఏంటి? అన్నీ ఉన్నాయి. అసలే ఎలచ్చన్ల కాలం కదా? డేగలు తిరుగుతున్నాయి సుమా.. ద్రోహం చేసే పని పెట్టకండి.
పార్టీ పెట్టిన కాంచీ గిట్ల మాట్లాడి బాగుపడినోడు ఎవ్వడు లేడు. సత్తెనాశనం అయ్యిండు. డౌట్ ఉంటె చరిత్ర చూడుండ్లి. అయినా మీకు వచ్చిన కష్టాలు ఏమున్నయి.. కేసీఆర్ సార్కి చెప్పనీకి భయం ఉంటే చిన్న సార్ కేటీఆర్కి చెప్పితే పరిష్కారం దొరికేది కదా? ఏం చేద్దామని.. గిదేం రంజాటకం.. అవ్వ తోడు మిమ్ముల చూస్తే జాలి వేస్తున్నది. గీ లొల్లి ఏందే మల్లన్నా.. ఓ హన్మంతన్న.. ఇక ఆపుర్రి. అన్ని కేసీఆర్ సార్ సూసుకుంటడులే. తేడా వస్తే వాతలు తప్పదేమో చూసుకోండ్రి. అందులోనూ కేసీఆర్ నాయకత్వంలో 21 సంవత్సరాలుగా అప్రతిహతంగా నడుస్తున్న పార్టీలో ఆయా జిల్లాల్లో నాయకులు పార్టీ అంతర్గత విషయాల గురించి మీడియా ముందుకు వస్తే అధోగతి పాలే. పట్నం ఎమ్మెల్యేల స్వరం వింటూ ఉంటే వారిలో అసంతృప్తి ఉందా? అవకాశవాదం ఉందా? అన్న కోణంలో చర్చ జరిగినా.. ఎరుపెక్కిన కళ్ళతో జనం ఓర కంట చూసే పరిస్థితి వచ్చినా.. ఎందుకో అధినాయకుడు లైట్ తీసుకున్నట్లు ప్రచారం కావడం గమనార్హం.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్. సమకాలీన రాజకీయాల్లో దార్శనికుడుగా పేరొందిన కేసీఆర్ నాయకత్వంలో అసంతృప్తులకు చోటు లేదు. ధిక్కార స్వరాలకు తావు లేదు. పాలన తత్వవేత్తలు హేన్రి ఫాయెల్, టేలర్ల లైన్ స్టాఫ్ సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకున్న కేసీఆర్ కేంద్రీకృత ప్రణాళిక సూత్రంతో బీఆర్ఎస్ను ఏర్పాటు చేసి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఏళ్ల నాటి కల నెరవేర్చేందుకు నడుం బిగించారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్కు బీఆర్ఎస్, దాని మిత్రపక్షాలే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారు. రెండు దశాబ్దాల్లో మునుపెన్నడూ లేని విధంగా దేశం అధోగతి పాలవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు బీఆర్ఎస్ పాలనను దేశమంతా కోరుకుంటున్నారు. ఎన్నికలకు పట్టుమని పది నెలలు లేకపాయే. స్టేషన్ ఘన్పూర్, నాగర్ కర్నూల్, తాండూర్, మహేశ్వరం, ఉప్పల్, పాలేరు టికెట్ల లొల్లి బహిరంగంగానే జరుగుతున్నది! వామ్మో.. వాయ్యో.. వీళ్లకు ఏం పోయేకాలం.. గీ మొత్తుకోళ్ళు, ఈసడింపులు బొంగురు గొంతు తిట్ల పురాణాలూ దేనికి సంకేతం? అయినా నీ ఇంటికి ఎవ్వలు వత్తాండ్రో, నీతో ఎవ్వలు రమ్మంటాండ్రో పెద్ద సార్కి అన్నీ తెలుత్త లేవా ఏందీ? నమ్మకాన్ని వమ్ము చెత్తే ఎట్లా ఉంటాదో తెల్సు కదా? అయినా మీకు ఏం తక్కువ జేసిండ్రు సారు. ఏహే ఉకొర్రీ. బీజేపీ పాలనకు చరమ గీతం పాడాలంటే కేసీఆర్ సంకల్ప బలం ఒక్కటే సరిపోదు కదా? ఒక పార్టీ ఒకే నాయకత్వం కింద క్రమశిక్షణతో మెదిలినప్పుడే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరనే ఆచంచలమైన విశ్వాసం ప్రజాస్వామ్య వాదులకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఒక అందమైన ముసుగు తగిలించుకుని గాంధీభవన్ వేదికగా గడబిడలు చేసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు కురిపించడం ఆ పార్టీలో సర్వ సాధారణం!
ఇలా మితిమీరిన ప్రజాస్వామ్యం వల్లనే ఆ పార్టీకి ప్రతిపక్షంగాగానీ, బీజేపీకి ప్రత్యామ్నాయంగా గానీ దేశంలో ఎదగలేదని పరిస్థితి ఎదురవుతున్నది. ప్రతి రాష్ట్రంలో మూడు కొట్లాటలు, ఆరు వెన్నుపోట్ల వల్ల చతికిలబడిన కాంగ్రెస్ తన ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటున్నదనే విమర్శ ఉంది! రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించే స్థాయికి ఎదిగేందుకు కాంగ్రెస్ అతి ప్రజాస్వామ్యం కలిసి వచ్చిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చారు. వీటిని బీఆర్ఎస్లోని అసంతృప్తులు పాఠాలుగా తీసుకోవాలి. విభేదాలు, అపోహలు మరచి కలిసికట్టుగా పార్టీ కోసం, ప్రజల కోసం పని చేయాలి.
అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కూడిన తెలంగాణ మాడల్ను అప్పుడే దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశం లభిస్తుంది. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అనే నినాదమే లక్ష్యంగా యావత్ బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు కదలాలి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు వెన్ను దన్నుగా నిలవాలి. ఐక్యతతోనే దేశాన్ని కాపాడుకోవటం సాధ్యమైతుంది.
-సంగని మల్లేశ్వర్
98662 55355