U20 Championships: అమెరికాలోని ఒరెగా వేదికగా జరుగుతున్న అండర్ 20 ఛాంపియన్షిప్స్ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. జావెలిన్ త్రోలో పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అశిష్ యాదవ్ (Ashish Yadav) రజతం కొల్లగొట్టగా.. హై జంప్లో బసంత్ కుమార్ మేఘ్వాల్ (Basant Kumar Meghwal) చరిత్ర సృష్టించాడు. పురుషుల ఫైనల్లో సత్తా చాటిన బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మాడు.
అండర్ 20 ఛాంపియన్షిప్స్లో భారత కుర్రాళ్లు రికార్డులు పట్టేస్తున్నారు. జావెలిన్ త్రోలో భావి తారగా ఎదుగుతున్న అశీష్ యాదవ్ సిల్వర్ మెడల్ సాధించిన మరునాడే.. హై జంపర్ బసంత్ కుమార్ మేఘ్వాల్ సైతం వెండి పతకం గెలుపొందాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అథ్లెట్ రెండో ప్రయత్నంలో ఏకంగా 2.21 మీటర్ల ఎత్తు దూకాడు. తద్వారా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్వనతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
🚨 Watch Basant win SILVER for India at World U20!!!
🥇 🇩🇿 Younes Ayachi – Gold
🥈 🇮🇳 Basant – Silver
🥉 🇺🇸 Otis Poole – BronzeAll three medal-winning athletes cleared the same height of 2.21m in High Jump.
The medals were therefore decided on countback, based on the number… pic.twitter.com/lYsbXwhjk5
— nnis Sports (@nnis_sports) August 9, 2026
అండర్ 20 ఛాంపియన్షిప్స్లో భారత్కు హై జంప్లో తొలి పతకం సాధించిన బసంత్ చరిత్రకెక్కాడు. లాంగ్ జంప్లో షహన్వాజ్ ఖాన్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో అశీష్ యాదవ్ 74.09 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానంతో రజతం పట్టేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం నీరజ్ పసిడి గెలిచిన ఈ టోర్నీలో అశీష్ అంచనాలు అందుకుంటూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు.