‘ముంగిట్లో అలికిడే లేదు గాని లెక్కల్లో మిక్కిలి’ అన్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ ముఖచిత్రం. కర్ణాటక రాజకీయ ముఖచిత్రానికి తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి కించిత్తు పోలిక లేదు. తెలంగాణకు ఉద్యమ నేపథ్యమున్నది. కర్ణాటకలో అదిలేదు కానీ కేవలం గత పాలకులైన బీజేపీ అవినీతిని ప్రజలు భరించలేకపోయారు. కాబట్టే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. అంతేగానీ అక్కడి రాజకీయ పరిస్థితుల్లో గానీ, సామాజిక పరిస్థితుల్లో గానీ కించిత్తు పోలిక తెలంగాణకు లేదు.
సంచలనాలకు కేంద్రబిందువైన సీఎం కేసీఆర్తో స్కా ములకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ నాయకు లా పోటీ పడేది ? ఈ మిలాకత్ లేని వ్యవహారంతో ములాకతు లు ఎలా సాధ్యమో మనకు అర్థం కానీ విషయం.ఈ మధ్య కాం గ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లకోసం కొన్ని బాసలు చేసింది. ఈ బాసల సాధ్యాసాధ్యాలను విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్య ప్రధాన ఎన్నికల అధికారి ‘ఎన్నికల్లో ప్రమాణాలు చేసేవారు వాటిని అమలు చేసే వీలుందా లేదా అనేది చూసుకొని చేయాలని’ సూచించారు.
మన ప్రధాని మోదీ కూడా ఉచితాలు ప్రమాదకరమని, అవి ప్రజలను సోమరులుగా చేస్తాయని అన్నారు. కానీ మొన్న కర్ణాటకలో, రేపు జరగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఎన్నో ఉచితాలు ప్రకటించారు. వారి మాటలలో ఆకర్షణీయత ఎక్కువ, ఆచరణాత్మకత తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.
ఏవైనా ఎన్నికల ప్రమాణాలు చేసేటప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు, అభివృద్ధి అంచనాలను దృష్టిలో పెట్టుకొని చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్రమాణాలు చేయాలన్న గత రెండు మూడు సంవత్సరాలలో వారి బడ్జెట్ వివరాలను సేకరించి వాటికి అనుగుణంగా వీలుందా లేదా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాణాలు చేయవలసి ఉంటుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎన్నికవడం కోసం చేసే ప్రమాణాలు కూడా ఆర్థిక వనరుల పరిమితులకు లోబడి చేయవలసిన బాధ్యత ఉంటుంది.
22-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ రాబడి రూ.1,70,000 కోట్ల వరకు ఉన్నది. ఇందులో 45 శాతం జీతా లు, పింఛన్లు, ఇతర నిర్వహణ ఖర్చులు రూ.76 కోట్ల వరకు ఉంటుంది. అంటే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు, ఉచితాలకు, సంక్షేమ కార్యక్రమాలకు రూ.94,000 కోట్లు మిగిలాయి. ఇందులో రూ.12 కోట్ల వరకు తీసుకున్న అప్పులు వాటిపై వడ్డీ లు తీర్చేందుకు తీసేస్తే ఇక అభివృద్ధి కార్యక్రమాలకు ఉచితాలకు మిగిలేది రూ.80,000 కోట్లు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రమాణాల మొత్తం ఖర్చు ఎంతవుతుందో చూసి మన రాష్ట్ర బడ్జెట్తో పోల్చి చూద్దాం. ముఖ్యం గా కాంగ్రెస్ ఆరు ప్రమాణాలు చేసింది. వాటిని తీర్చేందుకు కావలసిన మొత్తం వనరులు ఇలా ఉన్నాయి. కోటి 50 లక్షల ఎకరాలకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.15,000 ఇస్తామన్నారు. ఇందుకు మొత్తం ఖర్చు రూ. 22,500 కోట్లు. ప్రతి ఎస్సీ,ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామన్నారు. అవి 22 లక్షల కుటుంబాలున్నాయి. వీటికి రూ. 2,64,000 కోట్లు అవుతుంది. ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తామని ప్రమాణం చేశారు. కనీసం రెండు లక్షల మంది ఉంటారనుకు న్నా ఈ పద్ధతి కింద పదివేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం 30 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలా ఇవ్వాలంటే రూ.900 కోట్లు అవసరం పడుతుంది. 13 లక్షల గ్యాస్ వినియోగదారులకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలంటే దాని నిమిత్తం సబ్సిడీ రూ. 300 కోట్ల వరకు అవుతుంది.
ఇకపోతే ప్రతి సంవత్సరం అభివృద్ధి పనుల నిమిత్తం కనీసం రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంతే కాకుండా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేత కార్మికుల పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు, గొర్రెల పంపకాలు, స్కాలర్షిఫ్లు, మధ్యా హ్న భోజనానికి కలిపి కనీసం మరో రూ.20 వేల కోట్లు అవుతుంది. అంతేకాకుండా రెండు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వారికి సగటున ఆరు లక్షల చొప్పున జీతభత్యాలు ఇచ్చినా, ఆ మొత్తం రూ.12 వేల కోట్లు అవుతుంది.
ఈ ప్రమాణాలన్నీ నిలబెట్టుకునేందుకు కావలసిన మొత్తం రూ.3,59,000 కోట్లు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి పనులకు మిగిలేది రూ.80 నుంచి రూ.90 వేల కోట్లు మాత్రమే. ఇన్ని ప్రమాణాలు ఎలా నెరవేరుస్తారు. ఇది సాధ్యమా? అంటే ఐదు సంవత్సరాల్లో పెరిగే ఆదాయాన్ని
కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతి సంవత్సరానికి రూ.70,000 కోట్ల చొప్పున ఈ ప్రమాణాలను ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా,
మధ్య దళారుల బెడద లేకుండా నెరవేర్చగలిగితే సాధ్యమవుతుంది.
ఇలా రూ.70 వేల కోట్లు ఖర్చుపెట్టినా, ప్రతి సంవత్సరం ఇంకా రూ.30 వేల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, ఇప్పటికే నిర్మాణం లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టవలసి ఉంటుంది. అది ఏ మాత్రం సరిపోదు. అంతేకాకుండా ఈ ప్రమాణాల్లో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీలకు కేటాయించవలసి ఉంటుంది. కాబ ట్టి మిగతా 56 శాతం ఉన్న ఓటర్లు అయినటువంటి బీసీ లు, ఇంకో పది శాతం ఉన్న ఓసీలు కాంగ్రెస్కు దూరం కావచ్చు.
(వ్యాసకర్త : తెలంగాణ వికాస సమితి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు)
-ఫణి రాజారావు రామినేని
94406 40006